Posted on 2025-07-15 18:32:29
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు
మెడికల్ షాప్ నిర్వాహకులకు వేములవాడ ఏ.ఎస్పీ శేషాద్రిని రెడ్డి హెచ్చరిక
డైలీ భారత్, వేములవాడ: మైనర్ బాలికకు గర్భస్రావం(అబార్షన్) అయ్యేలా మందులు విక్రయించిన మెడికల్ షాప్ యజమానిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు వేములవాడ ఏ.ఎస్పీ శేషాద్రిని రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఓ మైనర్ బాలికను సిరిసిల్లకు చెందిన ఓ యువకుడు ప్రేమ, పెళ్లి పేరుతో అట్టి మైనర్ బాలికను శారీరకంగా వాడుకొగా అట్టి బాలిక గర్భం దాల్చగా అట్టి గర్భం పోవడానికి సిరిసిల్ల పట్టణానికి చెందిన గీతాంజలి మెడికల్ షాప్ యజమాని నల్లా శంకర్ ను ఆశ్రయించి ఒక మైనర్ బాలికకు గర్భం పోవడానికి మందులు ఇవ్వమనగా అట్టి గీతాంజలి షాప్ ఓనర్ చట్ట వ్యతిరేకంగా ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా గర్భం పోవడానికి మందులు ఇవ్వగా అట్టి మందులను వేసుకున్న మైనర్ బాలికకు గర్భ స్రావం అయినది. ఈ విషయంపై కేసు నమోదు చేసి గతంలో అట్టి యువకుడిని మే 30న అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది. మరియు చట్ట వ్యతిరేకంగా మైనర్ బాలికకు గర్భం పోవడానికి మందులు ఇచ్చిన గీతాంజలి మెడికల్ షాప్ ఓనర్ నల్ల శంకర్ ను 12- 07- 2025 రోజున రిమాండ్ కు తరలించనైనది.
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తే చర్యలు తప్పవు
ఈ సందర్భంగా ఏ.ఎస్పీ మాట్లాడుతూ డాక్టర్ పిస్క్రిప్షన్ లేకుండా మరియు చట్టానికి వ్యతిరేకంగా మెడికల్ షాప్ నిర్వాహకులు ఎవరైనా మందులు విక్రయిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మందులు విక్రయిస్తున్న తరుణంలో నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులను విక్రయించి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే వారినీ ఉపేక్షించేది లేదని తెలిపారు.
ప్రజల మధ్యకు వచ్చి సమస్యలు తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు
Posted On 2026-03-10 11:54:35
Readmore >
ప్రజావాణి అర్జీలు పెండింగ్ లో పెట్టవద్దు... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-09 19:45:58
Readmore >
మద్యం, జూదం, వ్యసనపరులకు అడ్డగా మారిన భద్రాచలం ఎస్సీ కమ్యూనిటీ హాల్
Posted On 2026-03-09 19:22:17
Readmore >
కొమ్ముగూడెం గ్రామంలో నూతన పశువుల ఆసుపత్రి భవనాన్ని నిర్మించండి
Posted On 2026-03-09 19:20:29
Readmore >
ఐటిడిఏ కాంప్లెక్స్ దుకాణాల అన్యాక్రాంతం పై విచారణ జరిపించాలి
Posted On 2026-03-09 19:19:18
Readmore >
కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల క్షేత్రంలో శ్రీవారిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
Posted On 2026-03-09 19:17:48
Readmore >
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ ర్యాలీ
Posted On 2026-03-09 19:09:41
Readmore >