Posted on 2025-07-15 15:47:23
జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండాలి
హాజరైన రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సిపి సాయి చైతన్య
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ప్రతి ఆషాడమాసం లో జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ లో వెలసిన శ్రీశ్రీశ్రీ నవదుర్గ ఆలయంలో టీఎన్జీవోఎస్ అధ్యక్షుడు సుమన్ ఇతర కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సిపి సాయి చైతన్య లు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా ప్రజలు సుభిక్షంగా ఆనందోత్సవాల మధ్య ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని వారు అన్నారు. టీఎన్జీవో ఎస్ వారు ప్రతి సంవత్సరం నవదుర్గ మాత ఆలయంలో బోనాల పండగ నిర్వహించడం ఎంతో శుభ సూచకమని అమ్మవారి దయ వివిధ శాఖలు పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, అవరోధాలు లేకుండా ఎలాంటి మహమ్మారిలు రాకుండా కోరారు. అలాగే ఇంత పెద్ద ఎత్తున టీఎన్జీవో అధ్యక్షుడు సుమన్ కులమతాలకు తేడా లేకుండా అమ్మవారి సన్నిధిలో పూజా కార్యక్రమాలు చేయడంతో పాటు మహా అన్నదాన ప్రసాదం వితరణ కార్యక్రమం చేయడం అభినందనీయమన్నారు
స్వయంగా డీజిల్ పోసిన పల్నాడు కలెక్టర్... పుకార్లకు చెక్ పెట్టిన కృతిక శుక్లా!
Posted On 2026-04-27 16:39:38
Readmore >
దమ్మపేటలో ఘనంగా భారత రాష్ట్ర సమితి (BRS)పార్టీ అవిర్భావ దినోత్సవ వేడుకలు
Posted On 2026-04-27 14:12:14
Readmore >
పదేళ్లలో ప్రజలకు సుపరిపాలన అందించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్
Posted On 2026-04-27 14:09:19
Readmore >
మొగలపల్లిలో సీనియర్ కమ్యూనిస్టు నాయకులు వెంకటరావుకు ఘన సన్మానం
Posted On 2026-04-27 10:36:06
Readmore >