Posted on 2025-07-15 15:47:23
జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండాలి
హాజరైన రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సిపి సాయి చైతన్య
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ప్రతి ఆషాడమాసం లో జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ లో వెలసిన శ్రీశ్రీశ్రీ నవదుర్గ ఆలయంలో టీఎన్జీవోఎస్ అధ్యక్షుడు సుమన్ ఇతర కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సిపి సాయి చైతన్య లు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా ప్రజలు సుభిక్షంగా ఆనందోత్సవాల మధ్య ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని వారు అన్నారు. టీఎన్జీవో ఎస్ వారు ప్రతి సంవత్సరం నవదుర్గ మాత ఆలయంలో బోనాల పండగ నిర్వహించడం ఎంతో శుభ సూచకమని అమ్మవారి దయ వివిధ శాఖలు పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, అవరోధాలు లేకుండా ఎలాంటి మహమ్మారిలు రాకుండా కోరారు. అలాగే ఇంత పెద్ద ఎత్తున టీఎన్జీవో అధ్యక్షుడు సుమన్ కులమతాలకు తేడా లేకుండా అమ్మవారి సన్నిధిలో పూజా కార్యక్రమాలు చేయడంతో పాటు మహా అన్నదాన ప్రసాదం వితరణ కార్యక్రమం చేయడం అభినందనీయమన్నారు
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >
"అక్షయ తృతీయ" నాడు మాత్రమే నిజరూపంలో దర్శనమిచ్చే "సింహాచలం అప్పన్న" స్వామి
Posted On 2026-04-18 13:51:32
Readmore >