| Daily భారత్
Logo




సురక్షితంగా పుడమికి చేరుకున్న శుభాన్షు శుక్లా అండ్ టీమ్

News

Posted on 2025-07-15 15:21:01

Share: Share


సురక్షితంగా పుడమికి చేరుకున్న శుభాన్షు శుక్లా అండ్ టీమ్

డైలీ భారత్, తెలంగాణ డెస్క్: భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతరిక్ష ప్రయాణం ముగిసింది. దాదాపు 18 రోజులపాటూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపిన శుభాన్షు బృందం ఇవాళ క్షేమంగా భూమికి చేరుకుంది. వీరు ప్రయాణిస్తున్న స్పేస్‌క్రాఫ్ట్‌ ఇవాళ మధ్యాహ్నం 3:01 గంటల సమయంలో అమెరికా కాలిఫోర్నియా సమీపంలోని సముద్ర జలాల్లో ల్యాండ్‌ అయ్యింది. అనంతరం అక్కడే ఉన్న సిబ్బంది వారి వద్దకు చేరుకొని నౌకలోకి తీసుకొచ్చారు. కొన్ని నిమిషాల వ్యవధిలో వ్యోమగాములు ఒక్కొక్కరు అభివాదం చేసుకుంటూ అవనిపై అడుగుపెట్టారు.

వ్యోమగాములు భూమికి చేరిన తర్వాత ఏడు రోజులపాటూ క్వారంటైన్‌కు తరలించనున్నట్లు ఇస్రో ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. జీరో గ్రావిటీలో గడిపి వచ్చిన వ్యోమగాముల శరీరాలు భూ వాతావరణానికి అలవాటు పడేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇస్రోకు చెందిన ఫ్లైట్‌ సర్జన్లు వారం రోజుల పాటూ వ్యోమగాముల ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ను నిరంతరం పర్యవేక్షిస్తారని వెల్లడించింది

యాక్సియం-4 మిషన్‌లో భాగంగా ఈ ప్రయోగాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మిషన్‌లో భాగంగా శుభాన్షు శుక్లాతోపాటు నలుగురు వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు. అంత‌రిక్షంలోకి వెళ్లిన రెండో భార‌త వ్యోమ‌గామిగా శుభాన్షు శుక్లా రికార్డు క్రియేట్ చేశారు. 1984లో సోవియట్‌ యూనియన్‌కు చెందిన ఇంటర్‌కాస్మోస్‌ మిషన్‌ కింద సూయజ్‌ టీ-11 వ్యోమనౌకలో భారత వ్యోమగామి రాకేశ్‌శర్మ తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్లి ఎనిమిది రోజులపాటు ఉండి తిరిగి వచ్చారు. తాజా ప్రయోగంతో 41 ఏండ్ల తర్వాత రోదసిలోకి వెళ్లి వస్తున్న రెండో భారతీయుడిగా శుభాన్షు రికార్డు సృష్టించారు. ఐఎస్‌ఎస్‌లోకి వెళ్తున్న తొలి భారతీయుడు కూడా ఇతనే. తిరుగు ప్రయాణం నేప‌థ్యంలో ఆదివారం అంత‌రిక్ష కేంద్రంలో ఫేర్‌వెల్ సెర్మనీ జ‌రిపారు.

Image 1

2003 DSC ఉపాధ్యాయుల చలో హైదరాబాద్ మహా విజ్ఞాపన సభకు టీపీటీఫ్ పూర్తి మద్దతు

Posted On 2026-03-05 22:09:37

Readmore >
Image 1

ఓంకారేశ్వర ఆలయా అభివృద్ధికి కృషి చేస్తా సైంటిస్ట్ పైడి ఎల్లారెడ్డి

Posted On 2026-03-05 22:08:10

Readmore >
Image 1

ఆపరేషన్ నిమిత్తమై సకాలంలో బి పాజిటివ్ రక్తం అందజేత

Posted On 2026-03-05 22:07:03

Readmore >
Image 1

శీర్షిక: మంజుల అనే నేను

Posted On 2026-03-05 22:05:42

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలకు కంప్యూటర్ అందజేసిన కెనరా బ్యాంకు మేనేజర్ వేగి శ్రీహరి

Posted On 2026-03-05 22:00:22

Readmore >
Image 1

కరకగూడెం మండలం అశ్వాపురం పాడు గ్రామంలో వ్యక్తి దారుణ హత్య పలువురు అరెస్ట్

Posted On 2026-03-05 21:59:32

Readmore >
Image 1

అబుదాబి విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో తెలంగాణ వ్యక్తి గాయపడ్డాడు

Posted On 2026-03-05 06:04:46

Readmore >
Image 1

సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ

Posted On 2026-03-04 23:23:12

Readmore >
Image 1

స్త్రీ తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నిరూపించిన నాగ్‌పూర్‌కు చెందిన దీపాలి ఖోబ్రగడె

Posted On 2026-03-04 21:01:53

Readmore >
Image 1

మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ

Posted On 2026-03-04 20:00:46

Readmore >