Posted on 2025-07-15 09:38:06
ఒకరు అక్కడికక్కడే మృతి
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని శాలివాహన్ నగర్ పార్క్ వద్ద దారుణం చోటుచేసుకుంది. శాలివాహన నగర్ పార్కు దగ్గర గుర్తుతెలియని వ్యక్తులు నలుగురు కారులో వచ్చి చందు రాథోడ్ అనే వ్యక్తి పై కాల్పులు జరిపి పారిపోయారు. చందు రాథోడ్ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. సీపీఐ నాయకుడు చందు రాథోడ్ ఉదయం వాకింగ్ చేసి ఇంటికి వెళ్తున్న సమయంలో కాపు కాచి హత్య చేశారు ప్రత్యర్థులు. స్నేహితుల తో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న చందు రాథోడ్ కంట్లో కారం చల్లారు దుండగులు. వారి నుంచి తప్పించుకునేందుకు పరిగెత్తునున్న చందు రాథోడ్ వెంటాడి వెంబడించి గన్ తో నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి స్విఫ్ట్ కార్లో పరారయ్యారు దుండగులు. హత్య సమయంలో 5మంది పాల్గొన్నట్లు ప్రాథమిక అంచనా.
హత్య కి గలా కారణాలు పాతకక్షలు గా ప్రాథమిక అంచనా.. నాగరకర్నూల్ జిల్లా అచంపేటకి చెందిన చందు రాథోడ్ కుటుంబంతో చైతన్యపురిలో నివాసం ఉంటున్నాడు. నాగర్ కర్నూల్ జిల్లా.. బల్మూరు మండలం నర్సాయిపల్లి స్వస్థలం.. నర్సాయపల్లి లో తల్లిదండ్రులు ఉంటారు..ఇతను 30 ఏళ్లుగా హైదరాబాద్ లోనే ఉంటున్నాడని తెలిసింది. చందు నాయక్ పై కాల్పులు జరిపి హత్య చేసింది కూడా సిపిఐ నాయకుడే.. సిపిఐ ఎంఎల్ నాయకుడు రాజేష్ కాల్పు జరిపినట్లుగా గుర్తింపు.. ఇద్దరి మధ్య ఉన్న భూ వివాదమే కాల్పులకు దారి తీసింది అంటున్నారు పోలీసులు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్టున్నట్లు తెలిపారు.
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >