| Daily భారత్
Logo




తప్పుడు కేసు పై పోలీసులు పునః విచారణ చేపట్టాలి.. సిపికి బాధితుల ఫిర్యాదు

News

Posted on 2025-07-14 21:11:52

Share: Share


తప్పుడు కేసు పై పోలీసులు పునః విచారణ చేపట్టాలి.. సిపికి బాధితుల ఫిర్యాదు

అక్రమ అట్రాసిటీ కేసులు పెట్టిన మాజీ ఎంపిటిసీ పై చర్యలు తీసుకోవాలి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:అక్రమంగా అట్రాసిటీ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్న మాజీ ఎంపీటీసీ చందర్ పై చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్యకు బాధితులు గున్నాల మురళీ గౌడ్ భార్య సుజాత, కొడుకు భార్గవ్ గౌడ్ తో కలసి ఫిర్యాదు చేశామన్నారు. ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన సిపీ విచారణ జరిపించి తగు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని బాధితులు తెలిపారు. అనంతరం బాధితులు మాట్లాడుతూ.. గతంలో తమకు ఇందిరమ్మ హయంలో ప్రభుత్వ భూమిని బ్రతుకుతెరువు కోసం ఇవ్వడం జరిగిందని, అట్టి భూమిపై కన్నేసిన కొండాపూర్ మాజీ ఎంపీటీసీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో తన పలుకుబడిని ఉపయోగించి భూమిని అక్రమంగా ఆక్రమించుకోవడం జరిగిందని ఆరోపించారు. రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై రికార్డులను తారుమారు చేసేందుకు ప్రయత్నం చేశారన్నారు. తమ వద్ద భూమికి సంబంధించిన పాత, కొత్త పాస్ బుక్ ఉన్నప్పటికీ, మమ్మల్ని భూమి వైపు వెళ్లకుండా భయభ్రాంతులకు గురి చేశారన్నారు. మాకు రైతుబంధు కూడా రాకుండా అధికారులతో నిలిపి వేయించారన్నారు. ఆక్రమించుకున్న విషయం తెలుసుకున్న మేము కుటుంబ సభ్యులతో అక్కడికి వెళ్లి నిలదీయడంతో వారి మనుషులతో దాడి చేయడమే కాకుండా పోలీసులతో కుమ్మక్కై తమపై అక్రమంగా అట్రాసిటీ కేసు నమోదు చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు సంవత్సరాలుగా కేసు గురించి కోర్టు చుట్టు తిరుగుతున్నామని, కోర్టు చుట్టూ తిరుగుతూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. మాకు ప్రాణ భయం ఉందని, దీనిపై తదుపరి సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని లేదంటే చావే శరణ్యమని అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లో ప్రజావాణిలో ఫిర్యాదు చేశామని, అనంతరం పోలీస్ కమిషనర్ ను కలిసి ప్రజావాణిలో ఫిర్యాదు చేసామన్నారు. గతంలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండడంతో అధికార పార్టీ ఎంపీటీసీపై ఏలాంటి చర్యలు తీసుకోలేకపోయారని వాపోయారు. ఇదే విషయాన్ని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ దృష్టికి తీసుకెళ్లామని, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి మా ఆవేదనను వెళ్లిబుచ్చుకున్నామని,  ఇకనైనా మాకు న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. మాభూమిని కొనుగోలు చేశానని తప్పుడు ప్రచారం చేస్తున్న మాజీ ఎంపీటీసీపై చర్యలు తీసుకొని మా భూమిని మాకు ఇప్పించాలని విజ్ఞపించారు.

Image 1

₹35 వేల లంచం తీసుకుంటూ జీహెచ్ఎంసీ ఎగ్జామినర్ పట్టుబాటు

Posted On 2026-03-06 07:54:12

Readmore >
Image 1

తెలంగాణకు కొత్త గవర్నర్గా శివ్ ప్రతాప్ శుక్లా

Posted On 2026-03-06 07:46:55

Readmore >
Image 1

2003 DSC ఉపాధ్యాయుల చలో హైదరాబాద్ మహా విజ్ఞాపన సభకు టీపీటీఫ్ పూర్తి మద్దతు

Posted On 2026-03-05 22:09:37

Readmore >
Image 1

ఓంకారేశ్వర ఆలయా అభివృద్ధికి కృషి చేస్తా సైంటిస్ట్ పైడి ఎల్లారెడ్డి

Posted On 2026-03-05 22:08:10

Readmore >
Image 1

ఆపరేషన్ నిమిత్తమై సకాలంలో బి పాజిటివ్ రక్తం అందజేత

Posted On 2026-03-05 22:07:03

Readmore >
Image 1

శీర్షిక: మంజుల అనే నేను

Posted On 2026-03-05 22:05:42

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలకు కంప్యూటర్ అందజేసిన కెనరా బ్యాంకు మేనేజర్ వేగి శ్రీహరి

Posted On 2026-03-05 22:00:22

Readmore >
Image 1

కరకగూడెం మండలం అశ్వాపురం పాడు గ్రామంలో వ్యక్తి దారుణ హత్య పలువురు అరెస్ట్

Posted On 2026-03-05 21:59:32

Readmore >
Image 1

అబుదాబి విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో తెలంగాణ వ్యక్తి గాయపడ్డాడు

Posted On 2026-03-05 06:04:46

Readmore >
Image 1

సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ

Posted On 2026-03-04 23:23:12

Readmore >