Posted on 2025-07-14 18:54:57
డైలీ భారత్, దమ్మన్నపేట:భారతదేశం నుంచి అంతరిక్షానికి వెళ్లిన రెండవ ఖగోళయాత్రికుడు శుభాంశు శుక్లా భూమికి తిరిగివచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని, ZPHS దమ్మన్నపేట పాఠశాల విద్యార్థులు వినూత్నంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా విద్యార్థులు అంతరిక్ష రంగవల్లిలతో పాఠశాల మైదాన్నాన్ని అలంకరించడంతో పాటు , కాగితంతో తయారు చేసిన గ్లోబ్లు రూపొందించి ప్రదర్శిస్తూ, దేశభక్తి గీతం "సారే జహాఁ సె అచ్చా" ను ఆలపించారు. అంతేకాకుండా, శుభాంశు శుక్లా ప్రయాణ విశేషాలను చూపించే విపులమైన పోస్టర్ రూపొందించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు బోయన్నగారి నారాయణ మాట్లాడుతూ,
"శుభాంశు శుక్లా సుమారు 18 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. ఈ సమయంలో ఆయన భూమి చుట్టూ సుమారు 96 లక్షల కిలోమీటర్లు ప్రయాణించారు. అంతరిక్ష నావ "ఇన్ఎస్ఎస్" (INS)లో ఉన్నప్పుడే అనేక శోధనలు చేపట్టారు. యూరీ గగారిన్, రాకేష్ శర్మ తరువాత అంతరిక్షానికి వెళ్లిన రెండవ భారతీయుడు శుక్లా" అని తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో అంతరిక్ష విజ్ఞానం, దేశభక్తి, మరియు శాస్త్రీయ ఆవిష్కరణల పట్ల ఆసక్తి పెరిగినట్టు ఉపాధ్యాయులు తెలియజేశారు.
కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని వినతి
Posted On 2026-03-06 23:23:50
Readmore >
శ్రీ శ్రీ గౌరీ సమేత ఓంకారేశ్వర స్వామి దేవాలయ చతుర్థి వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం
Posted On 2026-03-06 23:21:29
Readmore >
కేంద్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ సంస్థలు/గ్రామీణ స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం నిధులు
Posted On 2026-03-06 23:19:11
Readmore >
విద్యార్థుల్లో చైతన్యం కోసం రామగుండం పోలీసుల చైల్డ్ సేఫ్టీ, యాంటీ డ్రగ్స్ కార్యక్రమాలు
Posted On 2026-03-06 20:44:04
Readmore >
మంచినేనిపేట : 23 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి
Posted On 2026-03-06 20:36:31
Readmore >
భద్రాచలంలో ఘనంగా శ్రీశ్రీశ్రీ సంత్ సద్గురు సేవాలాల్ 287వ జయంతి వేడుకలు
Posted On 2026-03-06 20:11:17
Readmore >
నిరుద్యోగాన్ని అంతం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
Posted On 2026-03-06 20:09:42
Readmore >
TSUTF(తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్) కు రాజీనామా చేసిన తంగళ్ళపల్లి మండల శాఖ
Posted On 2026-03-06 20:04:50
Readmore >