| Daily భారత్
Logo




మహిళా సాధికారతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యం : రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి

News

Posted on 2025-07-14 19:38:45

Share: Share


మహిళా సాధికారతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యం : రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:మహిళల సాధికారతే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి అన్నారు. బోర్గం(పి)లోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్‌లో ఘనంగా జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తో కలిసి వడ్డీ లేని రుణాలు, బీమా చెక్కులను మహిళా సంఘాలకు పంపిణీ చేశారు. మహిళల అభివృద్ధికి సోలార్ ప్లాంట్లు,ఉచిత బస్సులు ప్రయాణం, పెట్రోల్ బంకులు, శక్తి క్యాంటీన్లు, బజార్లు, స్కూల్ యూనిఫాం స్టిచింగ్, ధాన్యం కొనుగోలు కేంద్రాల వంటి అంశాల్లో అవకాశాలు కల్పిస్తున్నామని రూరల్  ఎమ్మెల్యే భూపతి రెడ్డి తెలిపారు. వెనుకబడిన మహిళలకు చేయూతగా ఉచిత ఆర్టీసీ ప్రయాణంతో పాటు ఇందిరమ్మ ఇళ్ళను మహిళల పేరిట మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. నాలుగేళ్లలో మహిళల సంక్షేమానికి రూ. లక్ష కోట్లు ఖర్చు చేయనున్నట్టు ప్రకటించారు. అదే సమయంలో చట్టసభలలో 33% రిజర్వేషన్ల తీర్మానాన్ని కేంద్రానికి పంపినట్టు వెల్లడించారు. కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో 20,547 మహిళా సంఘాలకు రూ. 21.69 కోట్లు రుణాలు మంజూరు చేశామని, రూరల్ నియోజకవర్గంలో 5,781 సంఘాలకు రూ. 5.91 కోట్లు ఇచ్చినట్టు వివరించారు.


ఈ వేడుకలలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, డీఆర్డీఓ సాయాగౌడ్,పీసీసీ డెలికెట్ శేఖర్ గౌడ్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పోలసాని శ్రీనివాస్,డీసీసీ డెలికెట్ ధర్మగౌడ్, యూత్ నాయకులు ఉమ్మాజీ నరేష్, మాజీ ఐ సి డి ఎం ఎస్ చైర్మన్ మునిపల్లి సాయరెడ్డి, మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్, వివిధ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమృత పూర్ గంగాధర్, నవీన్ గౌడ్, ఎల్లయ్య, సాయరెడ్డి,  సొసైటీల చైర్మన్లు రామచంద్ర గౌడ్ నల్ల చంద్రశేఖర్ రెడ్డి  , కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజేందర్, శ్రీనివాస్,  జిల్లా, మండల మహిళా సమాఖ్యల ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఫ్యాన్ కు ఉరివేసుకొని మహిళా ఆత్మహత్య

Posted On 2026-06-24 19:18:46

Readmore >
Image 1

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్‌ఐ జీనత్ కుమార్

Posted On 2026-06-24 19:13:12

Readmore >
Image 1

విద్యార్థుల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పోరాటం

Posted On 2026-06-24 19:11:52

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 8 మందికి గాయాలు

Posted On 2026-06-24 17:55:51

Readmore >
Image 1

రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్

Posted On 2026-06-24 17:51:09

Readmore >
Image 1

జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ

Posted On 2026-06-24 17:45:21

Readmore >
Image 1

రూ. వేయి కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

Posted On 2026-06-24 17:44:27

Readmore >
Image 1

కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం

Posted On 2026-06-24 12:21:19

Readmore >
Image 1

ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం

Posted On 2026-06-23 22:33:33

Readmore >
Image 1

కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?

Posted On 2026-06-23 21:51:35

Readmore >