| Daily భారత్
Logo




మహిళా సాధికారతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యం : రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి

News

Posted on 2025-07-14 16:08:45

Share: Share


మహిళా సాధికారతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యం : రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:మహిళల సాధికారతే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి అన్నారు. బోర్గం(పి)లోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్‌లో ఘనంగా జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తో కలిసి వడ్డీ లేని రుణాలు, బీమా చెక్కులను మహిళా సంఘాలకు పంపిణీ చేశారు. మహిళల అభివృద్ధికి సోలార్ ప్లాంట్లు,ఉచిత బస్సులు ప్రయాణం, పెట్రోల్ బంకులు, శక్తి క్యాంటీన్లు, బజార్లు, స్కూల్ యూనిఫాం స్టిచింగ్, ధాన్యం కొనుగోలు కేంద్రాల వంటి అంశాల్లో అవకాశాలు కల్పిస్తున్నామని రూరల్  ఎమ్మెల్యే భూపతి రెడ్డి తెలిపారు. వెనుకబడిన మహిళలకు చేయూతగా ఉచిత ఆర్టీసీ ప్రయాణంతో పాటు ఇందిరమ్మ ఇళ్ళను మహిళల పేరిట మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. నాలుగేళ్లలో మహిళల సంక్షేమానికి రూ. లక్ష కోట్లు ఖర్చు చేయనున్నట్టు ప్రకటించారు. అదే సమయంలో చట్టసభలలో 33% రిజర్వేషన్ల తీర్మానాన్ని కేంద్రానికి పంపినట్టు వెల్లడించారు. కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో 20,547 మహిళా సంఘాలకు రూ. 21.69 కోట్లు రుణాలు మంజూరు చేశామని, రూరల్ నియోజకవర్గంలో 5,781 సంఘాలకు రూ. 5.91 కోట్లు ఇచ్చినట్టు వివరించారు.


ఈ వేడుకలలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, డీఆర్డీఓ సాయాగౌడ్,పీసీసీ డెలికెట్ శేఖర్ గౌడ్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పోలసాని శ్రీనివాస్,డీసీసీ డెలికెట్ ధర్మగౌడ్, యూత్ నాయకులు ఉమ్మాజీ నరేష్, మాజీ ఐ సి డి ఎం ఎస్ చైర్మన్ మునిపల్లి సాయరెడ్డి, మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్, వివిధ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమృత పూర్ గంగాధర్, నవీన్ గౌడ్, ఎల్లయ్య, సాయరెడ్డి,  సొసైటీల చైర్మన్లు రామచంద్ర గౌడ్ నల్ల చంద్రశేఖర్ రెడ్డి  , కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజేందర్, శ్రీనివాస్,  జిల్లా, మండల మహిళా సమాఖ్యల ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >