Posted on 2025-07-14 16:58:12
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నగరంలోని ఆర్టీసీ రెండో డిపోకు 33 కెవి లైన్ వేయుటకు ప్రభుత్వం ఆమోదించిన 100 ఫీట్ల రోడ్డులో కాకుండా 60 ఫీట్ల (ప్రతిపాదిత) రోడ్డు ఎన్నో వంకలుగా ఉన్న ప్రైవేటు వారి స్థలము సూచించి ఆర్టీసీ వారికి సుమారు రెండు కోట్ల భారం పడేటట్టు చూసిన టౌన్ ప్లానింగ్ టౌన్ ప్లానింగ్ అధికారి ఏ సి పి . శ్యాం కుమార్ పై చర్య తీసుకోవాలని ఆకుల పాపయ్య, శ్రావణ్ కుమార్, రవి లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధ్యత కలిగిన అధికారి నగరంలో ఏ రోడ్లు ఎంత ఉన్నవి, తన దగ్గర మ్యాపులు ఉన్నాయా లేదా పరిశీలించకుండా బాధ్యత రహితంగా వ్యవహరించారని ఆరోపించారు. సదరు అధికారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ని ఆపాలని కోరారు. దీనిపై విజిలెన్స్ ద్వారా విచారణ జరిపి తగిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యుత్ శాఖ అధికారి ఏడి తోట రాజశేఖర్ 100 ఫీట్ల రోడ్డులో తనకు అనుకూలమైన వ్యక్తులు ఉన్నారని, ఇంకా ఆమోదాం కానీ 60 ఫీట్ల రోడ్డులో బలవంతంగా ప్రజలు కష్టపడి కొనుకున్న ప్రైవేట్ స్థలాల నుండి భయభ్రాంతులకు గురిచేస్తూ విద్యుత్తు 33 కెవి లైన్ వేయిస్తున్నారని,
మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చెప్పిన వినకుండా పనిచేయడం చూస్తుంటే ఆయన నిర్లక్ష్యానికి నిదర్శనం అని అన్నారు. ఇతనిపై చర్య తీసుకోవాలని కోరారు. అలాగే విద్యుత్ శాఖ ఏ ఈ పైన కూడా చర్య తీసుకోవాలని కోరారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కి అదేవిధంగా జిల్లా సీపీకి వినతి పత్రం అందించారు.
ఈ కార్యక్రమంలో ఇండ్ల స్థలాల బాధితులు. కృష్ణారెడ్డి రమేష్ రెడ్డి దేవేందర్ రెడ్డి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్ఐ జీనత్ కుమార్
Posted On 2026-06-24 19:13:12
Readmore >
రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్
Posted On 2026-06-24 17:51:09
Readmore >
జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ
Posted On 2026-06-24 17:45:21
Readmore >
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >