| Daily భారత్
Logo




ఆర్టీసీ ప్రజాధనం రెండు కోట్లు వృధా చేసిన టౌన్ ప్లానింగ్... విద్యుత్ శాఖ ఏడి పై విజిలెన్స్ విచారణ చేపట్టాలి

News

Posted on 2025-07-14 16:58:12

Share: Share


ఆర్టీసీ ప్రజాధనం రెండు కోట్లు వృధా చేసిన టౌన్ ప్లానింగ్... విద్యుత్ శాఖ ఏడి పై విజిలెన్స్ విచారణ చేపట్టాలి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నగరంలోని ఆర్టీసీ రెండో డిపోకు 33 కెవి లైన్ వేయుటకు ప్రభుత్వం ఆమోదించిన 100 ఫీట్ల  రోడ్డులో కాకుండా 60 ఫీట్ల  (ప్రతిపాదిత) రోడ్డు ఎన్నో వంకలుగా ఉన్న ప్రైవేటు వారి స్థలము సూచించి ఆర్టీసీ వారికి సుమారు రెండు కోట్ల భారం పడేటట్టు చూసిన టౌన్ ప్లానింగ్ టౌన్ ప్లానింగ్ అధికారి ఏ సి పి . శ్యాం కుమార్ పై చర్య తీసుకోవాలని ఆకుల పాపయ్య, శ్రావణ్ కుమార్, రవి లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధ్యత కలిగిన అధికారి నగరంలో ఏ రోడ్లు ఎంత ఉన్నవి, తన దగ్గర మ్యాపులు ఉన్నాయా లేదా పరిశీలించకుండా బాధ్యత రహితంగా వ్యవహరించారని ఆరోపించారు. సదరు అధికారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ని ఆపాలని కోరారు.  దీనిపై విజిలెన్స్ ద్వారా విచారణ జరిపి తగిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యుత్ శాఖ అధికారి ఏడి తోట రాజశేఖర్ 100 ఫీట్ల రోడ్డులో తనకు అనుకూలమైన వ్యక్తులు ఉన్నారని, ఇంకా ఆమోదాం కానీ 60 ఫీట్ల రోడ్డులో బలవంతంగా ప్రజలు కష్టపడి కొనుకున్న ప్రైవేట్ స్థలాల నుండి భయభ్రాంతులకు గురిచేస్తూ విద్యుత్తు 33 కెవి లైన్ వేయిస్తున్నారని, 

మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చెప్పిన వినకుండా పనిచేయడం చూస్తుంటే ఆయన నిర్లక్ష్యానికి నిదర్శనం అని అన్నారు.  ఇతనిపై చర్య తీసుకోవాలని కోరారు. అలాగే విద్యుత్ శాఖ ఏ ఈ  పైన కూడా చర్య తీసుకోవాలని కోరారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కి అదేవిధంగా జిల్లా సీపీకి వినతి పత్రం అందించారు.


ఈ కార్యక్రమంలో ఇండ్ల స్థలాల బాధితులు. కృష్ణారెడ్డి రమేష్ రెడ్డి దేవేందర్ రెడ్డి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు

Image 1

ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

Posted On 2026-04-24 22:25:39

Readmore >
Image 1

హిందూ బంధువులారా కదలిరండి ...

Posted On 2026-04-24 22:20:16

Readmore >
Image 1

బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి

Posted On 2026-04-24 22:18:33

Readmore >
Image 1

ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది

Posted On 2026-04-24 19:11:00

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయంలో డీజీపీ ప్రత్యేక పూజలు

Posted On 2026-04-24 17:56:12

Readmore >
Image 1

ఆన్‌లైన్ రమ్మీ వ్యసనం… ఐదుగురి ప్రాణాలు బలి!

Posted On 2026-04-24 17:22:03

Readmore >
Image 1

నివారణ కలిగిన వ్యాధి మలేరియా

Posted On 2026-04-24 17:20:12

Readmore >
Image 1

బీజేపీ లోకి రాఘవ్ చద్దా

Posted On 2026-04-24 16:36:30

Readmore >
Image 1

మదనపల్లెలో టమాట ధర రూ.38కు చేరిక...

Posted On 2026-04-24 12:08:57

Readmore >
Image 1

పరువు హత్య.. చెల్లెలి చెలికాడిని కొట్టి చంపిన అన్నలు...

Posted On 2026-04-24 12:08:02

Readmore >