| Daily భారత్
Logo




యువకుడి హత్య... పాడు పడ్డ బావిలో మృతదేహం

News

Posted on 2025-07-13 17:00:03

Share: Share


యువకుడి హత్య... పాడు పడ్డ బావిలో మృతదేహం

డైలీ భారత్, జహీరాబాద్: జహీరాబాద్ పట్టణ పరిధిలోని ఫైజ్ నగర్ కు చెందిన ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వ్యక్తి మహమ్మద్ తాజుద్దీన్ (22)గా గుర్తించారు. పట్టణ పరిధిలో అల్లా నా రోడ్డులో గల రహమత్ నగర్ ప్రాంతంలో ఆయన మృతదేహం లభించింది. శనివారం మధ్యాహ్నం నమాజ్ కోసం వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయలుదేరిన యువకుడు రాత్రి వరకు రాలేదు. జామ మసీదు వద్ద అతని బైక్ ను రికవరీ చేశారు. ఆదివారం ఓ పాడు పడ్డ బావిలో మృతదేహం ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతదేహం మీద పెద్ద పెద్ద గాయాలు ఉన్నందున కసితీరా పొడిచి హత్య చేసి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా హత్య ఎవరు, ఎందుకు చేశారనేది తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. హతుడు ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నట్లు సమాచారం.

Image 1

స్కూల్ పరిసరాల్లో సిగరెట్, గుట్కా నిషేధం

Posted On 2026-04-19 22:26:42

Readmore >
Image 1

పీసా అమలు ఎక్కడ.?

Posted On 2026-04-19 22:25:03

Readmore >
Image 1

శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య

Posted On 2026-04-19 22:22:58

Readmore >
Image 1

ఆధార్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. 5 నెలలు ఫ్రీ

Posted On 2026-04-19 22:21:17

Readmore >
Image 1

మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తంబళ్ల రవి

Posted On 2026-04-19 14:12:55

Readmore >
Image 1

ఎంఎంటీఎస్‌లో అందరికీ ఉచిత ప్రయాణం?

Posted On 2026-04-19 10:18:18

Readmore >
Image 1

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్సా

Posted On 2026-04-18 22:48:35

Readmore >
Image 1

లవ్ జీహాద్ ని భారత దేశం నుండి తరిమి కొట్టాలి

Posted On 2026-04-18 22:34:02

Readmore >
Image 1

2029పై బీజేపీ దృష్టి..?

Posted On 2026-04-18 17:30:19

Readmore >
Image 1

రోడ్ సేఫ్టీ పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్ ప్రశంసలు

Posted On 2026-04-18 17:23:21

Readmore >