Posted on 2025-07-13 17:00:03
డైలీ భారత్, జహీరాబాద్: జహీరాబాద్ పట్టణ పరిధిలోని ఫైజ్ నగర్ కు చెందిన ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వ్యక్తి మహమ్మద్ తాజుద్దీన్ (22)గా గుర్తించారు. పట్టణ పరిధిలో అల్లా నా రోడ్డులో గల రహమత్ నగర్ ప్రాంతంలో ఆయన మృతదేహం లభించింది. శనివారం మధ్యాహ్నం నమాజ్ కోసం వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయలుదేరిన యువకుడు రాత్రి వరకు రాలేదు. జామ మసీదు వద్ద అతని బైక్ ను రికవరీ చేశారు. ఆదివారం ఓ పాడు పడ్డ బావిలో మృతదేహం ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతదేహం మీద పెద్ద పెద్ద గాయాలు ఉన్నందున కసితీరా పొడిచి హత్య చేసి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా హత్య ఎవరు, ఎందుకు చేశారనేది తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. హతుడు ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నట్లు సమాచారం.
శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య
Posted On 2026-04-19 22:22:58
Readmore >