| Daily భారత్
Logo




ఆర్డినెన్స్ పేరుతో కాంగ్రెస్ మరో మోసం బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

News

Posted on 2025-07-12 17:17:20

Share: Share


ఆర్డినెన్స్ పేరుతో కాంగ్రెస్ మరో మోసం బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ ను అటకెక్కించిన కాంగ్రెస్ సర్కార్.. ప్రస్తుతం ఆర్డినెన్స్ పేరుతో మరో మోసానికి తెరలేపిందని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. స్థానిక ఎన్నికల ముందు 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తేల్చకుండా కాలయాపన చేస్తున్నదని విమర్శించారు. ఇప్పుడు ఆర్డినెన్స్ అంటున్న ప్రభుత్వం.. కులగణన పేరుతో ఆరు నెలల పాటు కాలయాపన ఎందుకు చేసిందో చెప్పాలని నిలదీశారు. రాష్ట్ర సర్కార్.. బీసీ కమిషన్ పేరు చెప్పి కొంతకాలం, డెడికేటెడ్ కమిషన్ పేరుతో మరికొంతకాలం, ఢిల్లీకి బిల్లు పంపి ఇంకొంత కాలం సమయం గడిపిందని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై చిత్తశుద్ధి లేకే ఇలా చేస్తూ వస్తున్నదని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల అమలు కాలయాపనకే రేవంత్ సర్కారు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. చట్టబద్ధత లేని ఆర్డినెన్స్లు న్యాయస్థానాల ముందు నిలబడబోవని స్పష్టంచేశారు. ప్రభుత్వ అసంబద్ధ, గందరగోళ నిర్ణయాలతో తెలంగాణ బీసీ వర్గాలు నష్టపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉండి ఉంటే ఢిల్లీకి వెళ్లినపుడు కనీసం ఒక్కసారైనా బీసీ బిల్లు గురించి ప్రధానితో ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. తన సీటును కాపాడుకునే ప్రయత్నం తప్ప, రేవంత్ రెడ్డికి బీసీల సమస్యలు పరిష్కరించడంపై లేదని తెలిపారు. రేవంత్ రెడ్డి తన నిజాయితీని నిరూపించుకునేందుకు తక్షణమే 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు.

Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-04-21 19:56:02

Readmore >
Image 1

జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి

Posted On 2026-04-21 19:53:11

Readmore >
Image 1

సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-04-21 18:31:56

Readmore >
Image 1

జిల్లాలో ఒకే రోజు 58 మందికి కోర్టు శిక్షలు

Posted On 2026-04-21 18:28:04

Readmore >
Image 1

హాస్టల్ విద్యార్థుల సమస్యలపై ఏబీవీపీ ఆందోళన

Posted On 2026-04-21 18:25:47

Readmore >
Image 1

బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-04-21 17:08:06

Readmore >
Image 1

ఐవిఎఫ్ మరియు కామారెడ్డి రక్తదాతల సమూహ సేవలు అభినందనీయం

Posted On 2026-04-21 17:02:20

Readmore >
Image 1

హాష్ ఆయిల్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం

Posted On 2026-04-21 16:28:14

Readmore >
Image 1

భూమి మన బతుకు శ్వాస -- మంజుల పత్తిపాటి

Posted On 2026-04-21 16:26:27

Readmore >
Image 1

ఏసీబీ వలలో ఆర్డీవో..

Posted On 2026-04-21 16:08:22

Readmore >