Posted on 2025-07-09 21:30:33
జిల్లాలో ఎక్కడో ఓ చోట తరచుగా ఇలాంటి ఘటనలు చేసుకుంటున్న వైనం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఒక పోలీస్ స్టేషన్ లో యువకుడు ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. నగరంలో నాగారం ప్రాంతానికి చెందిన మహ్మద్ జీషాన్ ను స్థానిక అరవ టౌన్ పోలీసులు గంజాయి విక్రయిస్తున్న కేసులో సారంగపూర్ లో అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రిమాండ్ కు తరలించేందుకు సిద్ధం అవుతుంటే పోలీస్ స్టేషన్ లోని బాత్ రూంలో ఉన్న ఫినాయిల్ తాగడంతో అతడిని ఎల్లమ్మ గుట్టలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యం చేయించి కోలుకోవడంతో డిశ్చార్జ్ చేసినట్లు తెలిసింది. జీషాన్ ను మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకుని విచారణ రిమాండ్ వ్యవహారంలో వేధింపులు కారణమని బాధితుడి తండ్రి అయూబ్ ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో పోలీసుల కస్టడీలో ఉన్న యువకుడు మార్చి 115 మరువకముందే చనిపోయిన మరో విషయం యువకుడు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపుతోంది. ఇదిలా ఉండగా నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో గత కొన్ని నెలల కిందట రెంజల్ పోలీస్ స్టేషన్ లో ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే జిల్లా కేంద్రంలో నే ఇలాంటి ఘటనే ఓ యువకుడు లాకప్ లోనే ఆత్మహత్య యత్నానికి పాల్పడడం గమనార్హం.
నాయకపోడు కులస్థులకు ప్రత్యేక సీరియల్ నెంబర్ కేటాయించాలనీ డిమాండ్
Posted On 2026-04-20 18:40:20
Readmore >
గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన ఆత్మకూరు పోలీసులు
Posted On 2026-04-20 18:18:28
Readmore >
ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-20 15:16:27
Readmore >
విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు యాంటీ-ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం : డీఎస్పీ వెంకటేశ్వర్లు
Posted On 2026-04-20 13:57:43
Readmore >
బిజెపి పార్టీలో చేరిన సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ మరియు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ప్రతినిధులు
Posted On 2026-04-20 13:41:10
Readmore >