| Daily భారత్
Logo




గంజాయి విక్రయిస్తున్న వారిని పట్టుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు

News

Posted on 2025-07-09 17:58:56

Share: Share


గంజాయి విక్రయిస్తున్న వారిని పట్టుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ లోని రెండు ప్రాంతాలలో ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ సిఐ స్వప్న ఆధ్వర్యంలో బుధవారం మోపాల్ మండలం ఎల్లమ్మ కుంట, నగరంలోని అర్సపల్లి ప్రాంతాలలో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఎల్లమ్మ కుంట ప్రాంతంలో షేక్ నాజీయా బేగం, కే.మాదవ్ వద్ద 1.135 కిలో గ్రాములు ఎండు గంజాయి, ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. అర్సపల్లికి చెందిన షేక్ పర్వాజ్ అనే వ్యక్తి వద్ద 300 గ్రాముల ఎండు గంజాయి, ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నారు.5 యువతకు మత్తు పదార్థాలకు అలవాటు చేసే విధంగా గంజాయి ఇతర మత్తు పదార్థాలను విక్రయించే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఎన్ ఫోర్స్ మెంట్ సిఐ స్వప్న తెలిపారు. తొలిసారి గంజాయి కేసులో మహిళను అరెస్టు చేయడం జరిగిందన్నారు. ఈ దాడులలో ఎస్ఐలు నర్సింహ చారీ, రాం కుమార్ లు, హెడ్ కానిస్టేబుళ్లు రాజన్న, సిహెచ్ నారాయణ రెడ్డి, కానిస్టేబుళ్లు బోజన్న, హమీద్, శివసాయి, విష్ణు, అవినాష్, మంజుల లు ఉన్నారు.

Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >
Image 1

సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక

Posted On 2026-09-01 08:21:35

Readmore >
Image 1

జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్

Posted On 2026-09-01 05:09:26

Readmore >
Image 1

పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్

Posted On 2026-08-31 16:20:41

Readmore >