| Daily భారత్
Logo




అఖిల భారత కార్మికుల సమ్మె నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెకు మద్దతు

News

Posted on 2025-07-08 16:17:55

Share: Share


అఖిల భారత కార్మికుల సమ్మె నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెకు మద్దతు

కేంద్ర ప్రభుత్వము తీసుకువచ్చిన ఫోర్త్ లేబర్ కోడ్ ను రద్దు చేయాలని డిమాండ్

నిరుపేదల హక్కుల సాధన సమితి మద్దతు

సిద్దిపేట జిల్లా కన్వీనర్ ర్ మూర్తి ఆగిరెడ్డి వెల్లడి

డైలీ భారత్ న్యూస్ : ఉమ్మడి మెదక్: అఖిలభారత కార్మిక   సంఘాలునిర్వహిస్తున్న జూలై 9 2025 సార్వత్రిక సమ్మెకు మా నిరుపేదల హక్కుల సాధన సమితి సంఘీభావాన్ని మద్దతును తెలియజేస్తుంది 

ప్రియమైన ప్రజలారా ప్రజాస్వామిక వాదులారా కార్మికులను కట్టు బానిసలుగా మార్చే ఫోర్త్ లేబర్ కోడ్ను వెంటనే రద్దు చేయాలి పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి కార్మిక అసంఘటితరంగా కార్మికులు తీసుకున్న న్యాయమైన డిమాండ్లకు మా నిరుపేదాకుల సాధన సమితి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది 

1 స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి 

2 కనీస వేతనం 26 వేలుగా ఇవ్వాలి 

3 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం కాకుండా ఆపాలి 

4 కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి 

5 రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి 

6 రవాణా రంగ కార్మికులకు శాపంగా మారిన జీవో నెంబర్ 21 ని రద్దు చేయాలి 

7 భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి 

8 సంక్షేమ బోర్డు నుండి కార్మికులకు రావలసిన క్లెయిమ్స నువెంటనే చెల్లించాలి,9మున్సి పల్ కార్మికుల జీవితాన్ని వారి భద్రతను ప్రశ్నార్ధకంగా మార్చే ఆప్కాస్ రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి 

10 రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి రైతులకు ఉచిత ఎరువులు సరఫరా చేయాలి తెలంగాణలో కాలేశ్వరం నుండి మల్లన్న సాగర్ కు వస్తున్న గోదావరి నీటి నీ రైతు పొలాల్లోకి అందివ్వాలి 

11 అసంఘటిత రంగ కార్మికుల కు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి 12 సిపిఎస్ ను రద్దు చేయాలి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి 

13 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన టైంలో జీతభత్యాలు ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నందుకు కార్మికులు కర్షకులు తమ బిడ్డల చదువుల కోసం హాస్పిటల్ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఫైనాన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్లడం జరుగుతుంది. అట్లాంటి పరిస్థితులు కొంతమంది ఫైనాన్స్ వాళ్ళు నూటికి రెండూ లేక మూడు రూపాయల మిత్తి కాకుండా వచ్చిందే తడువుగా ఐదు నుంచి పది రూపాయల మిత్తిని (వడ్డీ) ముక్కు పిండి వసూలు చేయడమే కాకుండా వారి దగ్గర తాకట్టు పెట్టుకున్న ఇండ్లను భూములను కొద్దిపాటి బంగారాన్ని కూడా టైం కు డబ్బులు కట్టకపోతే గుంజుకొని వారిని నడిబజార్లోకి ఈడుస్తున్నారు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక వడ్డీ తీసుకొని ప్రజలను బాధలకు గురి చేస్తున్నాం ఫైనాన్స్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని అలాంటి ఫైనాన్స్ కంపెనీ వాళ్ళను మూసేయాలని డిమాండ్ చేస్తున్నాం

పై డిమాండ్స్ తో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక దర్శక ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ 2025 జూలై 9వ తేదీన అఖిలభారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మికులు కర్షకులు విద్యార్థి మేధావులు ఉద్యోగులు ప్రజలు యువతీ యువకులు మహిళలు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం ఈ సార్వత్రిక సమ్మెకు నిరుపేద కుల సాధన సమితి సంపూర్ణ మద్దతు తెలియ చేస్తుంది అని అన్నారు

Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >
Image 1

సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక

Posted On 2026-09-01 08:21:35

Readmore >