| Daily భారత్
Logo




అఘాయిత్యానికి పాల్పడి పోలీసులకు చిక్కిన ఆటో డ్రైవర్

News

Posted on 2025-07-06 13:29:58

Share: Share


అఘాయిత్యానికి పాల్పడి పోలీసులకు చిక్కిన ఆటో డ్రైవర్

డైలీ భారత్, కర్నూల్: తల్లితో కలిసి మరో ఊరుకు వచ్చిన విద్యార్థిని తప్పిపోయింది. ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించి ఓ ఆటో డ్రైవర్‌కు చిక్కింది. ఆ బాలికకు మాయమాటలు చెప్పిన డ్రైవర్‌ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత లాడ్జ్‌లో దిగబెట్టే ప్రయత్నం లో పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కి్స్తున్నాడు. ఈ ఘటనలో పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం

కర్నూలు జిల్లా ఆదోని డివిజన్‌లో ఇంటర్మీడియట్‌ చదువుతున్న బాలిక తన తల్లితో కలిసి ఈ నెల 4న ఎమ్మిగనూరుకు వచ్చింది. అయితే పని ముగించుకుని సాయంత్రం ఇంటికివెళ్లే క్రమంలో బాలిక తప్పిపోయింది. తన తల్లి జాడ వెతుకుతూ ఆదోని పట్టణం బసవేశ్వర సర్కిల్‌కు చేరుకుంది. అక్కడి నుంచి బస్టాండ్‌కు వెళ్లి, తన సొంత ఊరికి వెళ్లాలనుకున్న ఆ బాలిక ఆదోని మండలం ఇస్వీ గ్రామానికి చెందిన రమేశ్‌ అనే డ్రైవర్‌ ఆటోను ఎక్కింది. ఆమెను తీసుకుని బస్టాండ్‌కు వెళ్లే సమయానికి రాత్రి కావడంతో వారి ఊరికి వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్లేందుకు బస్సులు ఉండవని, ఈ రాత్రికి సమీపంలో ఉన్న తన అక్క వాళ్ల ఇంట్లో ఉండవచ్చని నమ్మించాడు. అది నిజమేనని నమ్మిన ఆ బాలిక అతనితో పాటు వెళ్లింది.

కానీ, రమేష్‌ ఆమెను అదే ఆటోలో పట్టణ శివారులోని ఓ నిర్మానుష  వెంచర్‌లోకి తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారం చేశాడు. భయంతో బాధితురాలు రోదించింది, దీంతో తోటి  స్నేహితులతో కలిసి ఆమెను ఆదోనిలోని ఓ ప్రైవేటు లాడ్జ్‌లో వదిలేందుకు తీసుకు పోయాడు.  అయితే పోలీసుల అనుమతి ఉంటేనే  లాడ్జ్‌ లో చేర్చుకుంటామని నిర్వాహకులు చెప్పడంతో.. అనుమతి కోసమని నిందితుడు ఆ అమ్మాయిని తీసుకుని మూడో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ పోలీసులు ఎంక్వయిరీ చేసే క్రమంలో అతని తీరును అనుమానించారు.  బాలికను ఆరా తీయగా తనపై జరిగిన అత్యాచారం ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే నిందితుడిని పోలీసులు అదుపులోకి  తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రమేశ్‌పై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా బాలిక తల్లిదండ్రులను పిలిపించి ఆ బాలికను ఆసుపత్రికి తరలించారు.

Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే

Posted On 2026-03-01 10:40:53

Readmore >
Image 1

రూ.5,456.26 కోట్లతో టీటీడీ 2026–27 బడ్జెట్ ఆమోదం

Posted On 2026-03-01 06:50:29

Readmore >
Image 1

సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న 29 వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్

Posted On 2026-02-28 21:44:48

Readmore >
Image 1

పాపకొల్లు గ్రామం : బుడియా బాపు జాతర కార్యక్రమం

Posted On 2026-02-28 21:39:40

Readmore >
Image 1

ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి

Posted On 2026-02-28 20:49:58

Readmore >
Image 1

యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాప్రయత్నం చేసిన వ్యక్తుల పై అట్టెంప్ట్ మర్డర్ & ఎస్సి / ఎస్టీ కేసు నమోదు

Posted On 2026-02-28 20:10:03

Readmore >
Image 1

గంజాయి మత్తును నుండి యువతను కాపాడుకుందాం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-02-28 19:39:47

Readmore >
Image 1

గ్రీన్ సెల్ఫీ పాయింట్ తో ఘనంగా సైన్స్ దినోత్సవ వేడుకలు

Posted On 2026-02-28 18:39:59

Readmore >
Image 1

రానున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు బిజెపి శాసనసభా పక్ష సమావేశం

Posted On 2026-02-28 18:35:18

Readmore >
Image 1

ఆహార భద్రత చట్టం పకడ్బందీగా అమలు చేయాలి : రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి

Posted On 2026-02-28 17:50:47

Readmore >