Posted on 2025-07-04 17:06:04
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: హిమాలయాల్లో మాత్రమే వికసించే బ్రహ్మకమలానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ పుష్పం అరుదుగా మాత్రమే పూస్తుంది. అలాంటి బ్రహ్మ కమలం ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలోనూ జిల్లా కేంద్రంలోని ఒకరి నివాసం లో విరబూసింది. విద్యుత్శాఖలో పనిచేస్తున్న ఏడీఈ తోట రాజశేఖర్ దంపతులు నిజామాబాద్ నగరంలో నివాసం ఉంటున్నారు. వీరు కర్ణాటక రాష్ట్రంలోని మురుడేశ్వర్ నుంచి గతంలో మొక్కను తీసుకువచ్చి తమ ఇంటి ఆవరణలో నాటారు . ప్రస్తుతం ఆ మొక్కకు మూడు పువ్వులు పూశాయి. అలాగే పోతంగల్ మండల కేంద్రంలో జింగరి గంగాధర్, జయశ్రీ దంపతులు బ్రహ్మకమలం మొక్కను బద్రీనాథ్ నుంచి తీసుకువచ్చినట్లు తెలిపారు . ఆ మొక్క సైతం పుష్పించింది. ఈ సందర్భంగా ఆ పువ్వులకు ప్రత్యేక పూజలు చేశారు.
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >
"అక్షయ తృతీయ" నాడు మాత్రమే నిజరూపంలో దర్శనమిచ్చే "సింహాచలం అప్పన్న" స్వామి
Posted On 2026-04-18 13:51:32
Readmore >