Posted on 2025-07-03 16:57:48
ప్రభుత్వ రేషన్ బియ్యం ప్రజలకు అందకుండా పక్కా దారి పట్టిస్తే కఠిన చర్యలు తప్పవు.
అక్రమంగా నిల్వ ఉంచిన 60 క్వింటాళ్లు పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.
టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ నటేష్.
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపిఎస్ ఆదేశాల మేరకు ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో బినవేని దేవయ్య s/o ఎల్లయ్య, age 70,అనే వ్యక్తి వివిధ ప్రాంతాల్లో తక్కువ ధరకు రేషన్ బియ్యం సేకరించి ఎక్కువ ధరకు అమ్మడానికి నిల్వ ఉంచడన్న సమాచారం మేరకు ఈరోజు జిల్లా టాస్క్ఫోర్స్ సిబ్బంది, ఎల్లారెడ్డిపేట పోలీసులు సంయుక్తంగా ఆకస్మిక దాడి చేసి 60 క్వింటాళ్లు స్వాధీనం చేసుకొని తదుపరి చర్యల నిమిత్తం దేవయ్య ను అక్రమంగా నిల్వ ఉంచిన 60 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో అప్పజెప్పడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ....
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తూ పేద ప్రజలకు అందకుండా పక్కదారి పట్టిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నిరంతరం నిఘా పెడుతూ స్పెషల్ డ్రైవ్ లు చేస్తూ విస్తృత స్థాయిలో దాడులు నిర్వహిస్తున్నామని అన్నారు.
ఈ దాడులలో టాస్క్ఫోర్స్ సిబ్బంది రాజేష్,తిరుపతి,శ్రీనివాస్ ,శివ పాల్గొన్నారు.
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >