Posted on 2025-07-02 17:53:24
తంగళ్ళపల్లి మండలం పద్మనగర్ సమీపంలోని కేంద్రీయ విద్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: విద్యాలయాల్లో విద్యార్థులకు సరైన బోధన అందించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ తంగళ్ళపల్లి మండలం పద్మనగర్ సమీపంలోని కేంద్రీయ విద్యాలయమును ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ విద్యాలయం లోని ప్రతి తరగతి గదిని తిరిగి పరిశీలించి 9వ తరగతి విద్యార్థులకు సంస్కృతం, హిందీ పాఠాలు చదివించారు. ఇందులో కొంతమంది విద్యార్థులు సంస్కృత పాఠాలను చదవ లేకపోవడం గమనించారు.
10వ తరగతి విద్యార్థులకు మ్యాథ్స్ సబ్జెక్టులో లెక్కలు ఇచ్చి వారితో చేపించారు. 7వ తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్, 8వ తరగతి విద్యార్థులకు సోషల్ బోధించారు. ప్రశ్నలు అడిగి వారి నుండి సమాధానాలు రాబట్టారు.
కేంద్రీయ విద్యాలయంలో విద్యాబోధన దేశం మొత్తం ఒకే విధంగా ఉంటుందని పోటీ పరీక్షలకు ఎక్కువ మంది విద్యార్థులు హాజరవుతున్నందున ప్రతి సబ్జెక్టులో విద్యార్థులు అత్యున్నతమైన విద్యాభ్యాసన చేయాలని సూచించారు. అదే విధంగా పిల్లలకు సరైన విద్యాబోధన అందించాలని ఉపాధ్యాయులను కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ వెంట కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ శేష ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
నాయకపోడు కులస్థులకు ప్రత్యేక సీరియల్ నెంబర్ కేటాయించాలనీ డిమాండ్
Posted On 2026-04-20 18:40:20
Readmore >
గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన ఆత్మకూరు పోలీసులు
Posted On 2026-04-20 18:18:28
Readmore >
ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-20 15:16:27
Readmore >
విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు యాంటీ-ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం : డీఎస్పీ వెంకటేశ్వర్లు
Posted On 2026-04-20 13:57:43
Readmore >
బిజెపి పార్టీలో చేరిన సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ మరియు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ప్రతినిధులు
Posted On 2026-04-20 13:41:10
Readmore >