Posted on 2025-07-02 14:23:24
తంగళ్ళపల్లి మండలం పద్మనగర్ సమీపంలోని కేంద్రీయ విద్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: విద్యాలయాల్లో విద్యార్థులకు సరైన బోధన అందించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ తంగళ్ళపల్లి మండలం పద్మనగర్ సమీపంలోని కేంద్రీయ విద్యాలయమును ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ విద్యాలయం లోని ప్రతి తరగతి గదిని తిరిగి పరిశీలించి 9వ తరగతి విద్యార్థులకు సంస్కృతం, హిందీ పాఠాలు చదివించారు. ఇందులో కొంతమంది విద్యార్థులు సంస్కృత పాఠాలను చదవ లేకపోవడం గమనించారు.
10వ తరగతి విద్యార్థులకు మ్యాథ్స్ సబ్జెక్టులో లెక్కలు ఇచ్చి వారితో చేపించారు. 7వ తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్, 8వ తరగతి విద్యార్థులకు సోషల్ బోధించారు. ప్రశ్నలు అడిగి వారి నుండి సమాధానాలు రాబట్టారు.
కేంద్రీయ విద్యాలయంలో విద్యాబోధన దేశం మొత్తం ఒకే విధంగా ఉంటుందని పోటీ పరీక్షలకు ఎక్కువ మంది విద్యార్థులు హాజరవుతున్నందున ప్రతి సబ్జెక్టులో విద్యార్థులు అత్యున్నతమైన విద్యాభ్యాసన చేయాలని సూచించారు. అదే విధంగా పిల్లలకు సరైన విద్యాబోధన అందించాలని ఉపాధ్యాయులను కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ వెంట కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ శేష ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
జైల్లో చిగురించిన ప్రేమ... జీవిత ఖైదీల పెళ్లికి రాజస్థాన్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్!
Posted On 2026-07-17 17:49:23
Readmore >
భారతదేశంలో సరికొత్త విప్లవం : దేశంలోనే మొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
Posted On 2026-07-17 17:07:37
Readmore >
ప్రియుడి మోజులో కన్నతల్లి ఘాతుకం... ఏడేళ్ల బాలుడిపై బ్లేడుతో దాడి!
Posted On 2026-07-17 15:20:28
Readmore >
సోషల్ మీడియాలో పరువు నష్టం : జిందం కళ చక్రపాణి, జిందం చక్రపాణి ఎస్పీకి ఫిర్యాదు
Posted On 2026-07-17 15:09:10
Readmore >
సిరిసిల్లలో ఫుడ్ పాయిజన్... బాధితులను పరామర్శించిన డీఎంహెచ్వో ఏంజెలా ఆల్ఫ్రెడ్
Posted On 2026-07-17 14:10:00
Readmore >
రాజన్న సిరిసిల్ల : అంగన్వాడీల ఆకస్మిక తనిఖీ... పోషకాహారంపై కలెక్టర్ కీలక ఆదేశాలు
Posted On 2026-07-17 14:04:31
Readmore >
ఆమిర్ ఖాన్ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >