Posted on 2023-09-06 13:46:57
డైలీ భారత్, సిరిసిల్ల న్యూస్: అరుణ్,సాగర్ అనే ఇద్దరు గత కొన్ని రోజులుగా జల్సాలకు ఆలవాటు పడి గంజాయి తాగుతు, తమకు అవసరము పడ్డప్పుడల్లా ఇద్దరు కలసి గుర్తు తెలియని వ్యక్తి దగ్గర గంజాయి కొనుక్కొని తాగుతూ, గంజాయి తాగే వారికి అదిక రేటుకి అమ్ముచున్నారు. కొన్ని రోజుల క్రితం నిదితులు మరో వ్యక్తి దగ్గరికి వెళ్ళి గంజాయి కొనుక్కొని వచ్చి తాగుతూ ఈ రోజు మిగిలిన గంజాయిని తాగడానికి బై పాస్ రోడ్డు లోని యెల్లమ్మ గుడి దగ్గర లో గల కళ్ళు దుకాణం దగ్గరికీ రాగా నమ్మదగిన సమాచారం మేరకు వారిద్దరిని పట్టుకొని వారి దగ్గర నుండి మొత్తం 150 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోని నిందితులను రిమాండ్ కు తరలించనైనదని వీరిద్దరికి గంజాయి అమ్మిన వ్యక్తిని త్వరలో పట్టుకోవడం జరుగుతుంది అని సి. ఐ ఉపేందర్ తెలిపారు.
గంజాయి తాగుతూ పట్టుబడ్డ నిందుతుల వివరాలు
1.పులి అరుణ్, తండ్రి: దశరథo, 26 సం.లు, పద్మశాలి, నివాసం: టెక్స్టైల్ పార్క్, తంగళ్ళపల్లి మండలం .
2.గంగధర సాగర్ తండ్రి:కిషన్, 20 సం.లు, కుమ్మరి, నివాసము.మండేపల్లి గ్రామం, తంగళ్ళపల్లి మండలం
యువతకు పోలీస్ వారి విజ్ఞప్తి గంజాయి లాంటి మత్తు పదార్థాలను సరఫరా చెయ్యడం తాగడం చట్ట రీత్యా నేరం కావున గంజాయి తగిన,సరఫరా చేసిన వారిమీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. గంజాయి సంబంధిత సమాచారం ఉంటే సంబంధిత పోలీస్ వారికి లేదా డయల్ 100 కి సమాచారం అందించాలని కోరారు సమాచారం అందించాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతాయి అన్నారు..
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >