Posted on 2025-07-01 11:37:24
మరికొందరికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు
సహాయక చర్యలు చేపట్టిన అధికారులు
ప్రమాద కారణాలపై దర్యాప్తు ప్రారంభం
డైలీ భారత్, తమిళనాడు: తమిళనాడులోని శివకాశిలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఉదయం ఓ బాణసంచా తయారీ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో నలుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
దేశవ్యాప్తంగా టపాసుల తయారీకి కేంద్రంగా ఉన్న శివకాశిలోని ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో కార్మికులు విధుల్లో నిమగ్నమై ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో ఫ్యాక్టరీ ప్రాంగణంలో దట్టమైన పొగ, మంటలు అలుముకున్నాయి. ఏం జరిగిందో తెలుసుకునే లోపే నలుగురు కార్మికులు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. మరికొందరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది
#shivakasi #fire accident #tamilanadu
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-01 10:40:53
Readmore >
సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న 29 వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్
Posted On 2026-02-28 21:44:48
Readmore >
యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాప్రయత్నం చేసిన వ్యక్తుల పై అట్టెంప్ట్ మర్డర్ & ఎస్సి / ఎస్టీ కేసు నమోదు
Posted On 2026-02-28 20:10:03
Readmore >
గంజాయి మత్తును నుండి యువతను కాపాడుకుందాం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-02-28 19:39:47
Readmore >