Posted on 2025-06-26 19:43:57
డైలీ భారత్, మహబూబాబాద్: మహబూబాబాద్ మండలంలోని బ్రాహ్మణపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను వరంగల్ ఆర్జెడి సత్యనారాయణ రెడ్డి, డీఈవో రవీందర్ రెడ్డి సందర్శించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన అమలుతీరును పరిశీలించారు. పాఠశాలలో బేస్ లైన్ పరీక్షలు నిర్వహిస్తుండగా ఇంగ్లీషు, గణితంలో విద్యార్థులను పరీక్షించి సంతృప్తిని వ్యక్తం చేశారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా చక్కని గార్డెనింగ్ తో ఆహ్లాదకరంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. పాఠశాల అభివృద్ధికి ప్రధానోపాధ్యాయులు తీసుకుంటున్న కార్యక్రమాలను, ఉపాధ్యాయులు పనితీరును ప్రత్యేకంగా అభినందించారు
ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ ఆజాద్ చంద్రశేఖర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధారావత్ భద్రునాయక్ ఉపాధ్యాయులు పాలకుర్తి మౌనిక, మాడిశెట్టి సూర్యప్రకాష్, గొట్టిముక్కల పవన్ రాజ్, బొమ్మర కృష్ణమూర్తి, రాచకొండ ఉపేందర్, కుప్పం సూర్య తేజ, బానోత్ శంకర్ పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో పేకాట, చిత్తు బొత్తులపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-06 21:41:28
Readmore >