Posted on 2023-12-13 14:00:25
డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం లోని బెల్ట్ షాపులపై ఎక్సైజ్ శాఖ దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే బెల్ట్ షాపులను మొత్తంగా బంద్ చేయాలని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశాల నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అధికారులు ఆ దిశగా వ్యూహాలను రచి స్తున్నారు.
రాష్ట్రంలో బెల్ట్ షాపులను బంద్ చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పొందు పరిచింది. కాంగ్రెస్ మే నిఫెస్టోలో పెట్టినట్లుగా నే రాష్ట్రంలో బెల్ట్ షాపులను బంద్ చేయించేందుకు ఎక్సై జ్ శాఖ కసరత్తు ప్రారంభిం చింది.
రాష్ట్రం లో మొత్తం 2,620 వైన్స్లతో పాటు 1,800 బార్ అండ్ రెస్టారెం ట్లు ఉన్నాయి. వైన్ షా పులకు అనుబంధంగా గ్రామాల్లో లక్షకు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి.
తెలంగాణలో మొత్తం12 వేల 769 గ్రామపంచా యతీలు ఉండ గా ఒక్కో గ్రామంలో 6 నుంచి 10 కి పైగా బెల్ట్ షాపులుండగా, రాష్ట్రంలో లక్షా 10 వేలకు పైగా బెల్ట్ షాపులు ఉన్నట్టు ఎక్సైజ్ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
అయితే బెల్ట్ షాపులను బంద్ చేయకుంటే వారిపై కేసులు పెట్టేలా ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. ఎక్సైజ్ శాఖకు సంవత్సరానికి సుమారుగా రూ.40 వేల కోట్ల ఆదాయం ఈ శాఖ ద్వారా వస్తుంది.
అయితే ఈ బెల్టుషాపుల ద్వారా సుమారు రూ.10 వేల కోట్ల ఆదాయం వస్తున్నట్టుగా ఎక్సైజ్ అధి కారులు పేర్కొంటున్నారు.
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ
Posted On 2026-04-22 20:13:36
Readmore >
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >