Posted on 2025-06-19 10:34:19
డైలీ భారత్, తమిళనాడు: కుమార్తె వేరేవ్యక్తితో వెళ్లిపోవడంతో మనస్తాపంతో ఆమె తల్లి, అవ్వ ఇద్దరు మనవరాళ్లను చంపి ఆపై ఉరేసుకొన్న విషాధఘటన తమిళనాడు రాష్ట్రంలో దిండుక్కల్ జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసుల కథనం మేరకు..
ఓట్టన్సత్రం సమీపంలోని చిన్నకులిప్పట్టికి చెందిన పవిత్ర(27)కు తొమ్మిదేళ్ల కిందట వివాహామైంది. దంపతుల మధ్య గొడవల కారణంగా పుట్టింటికి వచ్చేసింది. కొద్దినెలలుగా పవిత్ర తన కుమార్తెలు లిథిక్సా(8), దీపికా(5)తో చిన్నకులిప్పట్టిలోని తల్లి కాళీశ్వరి ఇంట్లో ఉంటోంది. మంగళవారం బయటకెళ్లిన పవిత్ర తిరిగి రాలేదు. ఆమె వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని వెళ్లిపోయినట్లు తెలుసుకున్నారు. మనస్తాపం చెందిన కాళీశ్వరి(47), తన తల్లి చెల్లమ్మాల్(65)తో కలిసి మనవరాళ్లు లిథిక్సా, దీపికాను ఉరికి వేలాడదీసి, ఆపై వారిద్దరు కూడా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం ఉదయం సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్మార్టానికి తరలించి విచారణ చేపట్టారు. పవిత్ర కోసం గాలిస్తున్నారు.
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >