Posted on 2025-05-31 17:35:13
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్లో ఎమ్మెల్సీ కవిత.. తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. బంజారాహిల్స్లోని నూతన కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. కవిత వెంట భర్త ఉన్నారు. భర్తతో కలిసి ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు
నూతన కార్యాలయంలో కేసీఆర్, కవిత ఫొటోలు ప్రత్యేకంగా పెట్టారు. ఇక తెలంగాణ జాగృతి బ్యానర్లో ప్రొఫెసర్ జయశంకర్, కేసీఆర్ చిత్రాలు ఉన్నాయి. అలాగే కార్యాలయంలో బీఆర్. అంబేద్కర్, జయశంకర్, తెలంగాణ తల్లి, జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఫులే విగ్రహాలతో పాటు అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేశారు.
బంజారాహిల్స్లో తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. అనంతరం భర్తతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ప్రొ.జయశంకర్, కేసీఆర్, కవిత మినహా బీఆర్ఎస్కు సంబంధించిన మిగతా నేతలెవరి ఫొటోలు కనిపించకపోవడం ఆసక్తిగా మారింది. అయితే కవిత త్వరలో కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నారని, ఆ పార్టీ జెండా పాలపిట్ట రంగులో ఉండబోతున్నదనే ప్రచారం జోరుగా వినిపిస్తున్న వేళ ఇవాళ్టి కార్యక్రమానికి ఆమె అదే రంగు చీరతో రావడం హాట్ టాపిక్గా మారింది.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >