Posted on 2025-05-31 17:35:13
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్లో ఎమ్మెల్సీ కవిత.. తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. బంజారాహిల్స్లోని నూతన కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. కవిత వెంట భర్త ఉన్నారు. భర్తతో కలిసి ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు
నూతన కార్యాలయంలో కేసీఆర్, కవిత ఫొటోలు ప్రత్యేకంగా పెట్టారు. ఇక తెలంగాణ జాగృతి బ్యానర్లో ప్రొఫెసర్ జయశంకర్, కేసీఆర్ చిత్రాలు ఉన్నాయి. అలాగే కార్యాలయంలో బీఆర్. అంబేద్కర్, జయశంకర్, తెలంగాణ తల్లి, జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఫులే విగ్రహాలతో పాటు అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేశారు.
బంజారాహిల్స్లో తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. అనంతరం భర్తతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ప్రొ.జయశంకర్, కేసీఆర్, కవిత మినహా బీఆర్ఎస్కు సంబంధించిన మిగతా నేతలెవరి ఫొటోలు కనిపించకపోవడం ఆసక్తిగా మారింది. అయితే కవిత త్వరలో కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నారని, ఆ పార్టీ జెండా పాలపిట్ట రంగులో ఉండబోతున్నదనే ప్రచారం జోరుగా వినిపిస్తున్న వేళ ఇవాళ్టి కార్యక్రమానికి ఆమె అదే రంగు చీరతో రావడం హాట్ టాపిక్గా మారింది.
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >