Posted on 2025-05-31 13:16:52
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్లలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట ఎమ్మార్వో కార్యాలయంలో సర్వేయర్ గా విధులు నిర్వర్తిస్తున్న నాగరాజు రూ.15 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన జక్కాపురం మల్లేశం అనే రైతు భూమి కొలతల పంచనామ ధ్రువీకరణ పత్రం జారీ కోసం లక్ష రూపాయలు డిమాండ్ చేయగా, మల్లేశం గతంలో రూ.22 వేల రూపాయలు నాగరాజుకు ఇచ్చాడు. కాగా శనివారం చంద్రంపేట రైతు వేదిక వద్ద మరో రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. అనంతరం నాగరాజును అధికారులు ఎల్లారెడ్డిపేట ఎమ్మార్వో కార్యాలయానికి తరలించి విచారణ జరుపుతున్నారు.
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >