Posted on 2025-05-16 19:06:28
డైలీ భారత్, న్యూస్ పఠాన్ చేరు: సంగారెడ్డి జీల్లా పటన్ చెరు మండలం రుద్రారం ఎంఎస్ఎన్ పరిశ్రమ గేట్ ముందు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సు ఢీకొని మృతి చెందిన భూమయ్య కుటుంబానికి 30 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో డిమాండ్ చేసారు. అనంతరం సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు నాగేశ్వరావు మాట్లాడుతూ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన , పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మరియు కార్మిక శాఖ అధికారులు వెంటనే స్పందించి ఎంఎస్ఎన్ పరిశ్రమలో తనిఖీలు నిర్వహించి, యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని అయన డిమాండ్ చేశారు. ఎంఎస్ఎన్ పరిశ్రమలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా కార్మిక శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ డిమాండ్లను తెలియజేస్తూ, సీఐటీయూ ఆధ్వర్యంలో ఈరోజు కంపెనీ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. పరిశ్రమ యాజమాన్యం స్పందించి, మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని తెలిపారు , మృతి ని కుటుంబానికి సీఐటీయూ సంఘం అండగా ఉంటుందని ఆయన తెలియజేశారు.
ఈ కార్యక్రమం లో సీఐటీయూ యూనియన్ నాయకులు , శ్రీనివాస్, వెంకటేష్, శాంతకుమార్, యాదయ్య, గడ్డ మీది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్బ్యాగ్లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >