Posted on 2025-05-16 22:36:28
డైలీ భారత్, న్యూస్ పఠాన్ చేరు: సంగారెడ్డి జీల్లా పటన్ చెరు మండలం రుద్రారం ఎంఎస్ఎన్ పరిశ్రమ గేట్ ముందు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సు ఢీకొని మృతి చెందిన భూమయ్య కుటుంబానికి 30 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో డిమాండ్ చేసారు. అనంతరం సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు నాగేశ్వరావు మాట్లాడుతూ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన , పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మరియు కార్మిక శాఖ అధికారులు వెంటనే స్పందించి ఎంఎస్ఎన్ పరిశ్రమలో తనిఖీలు నిర్వహించి, యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని అయన డిమాండ్ చేశారు. ఎంఎస్ఎన్ పరిశ్రమలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా కార్మిక శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ డిమాండ్లను తెలియజేస్తూ, సీఐటీయూ ఆధ్వర్యంలో ఈరోజు కంపెనీ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. పరిశ్రమ యాజమాన్యం స్పందించి, మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని తెలిపారు , మృతి ని కుటుంబానికి సీఐటీయూ సంఘం అండగా ఉంటుందని ఆయన తెలియజేశారు.
ఈ కార్యక్రమం లో సీఐటీయూ యూనియన్ నాయకులు , శ్రీనివాస్, వెంకటేష్, శాంతకుమార్, యాదయ్య, గడ్డ మీది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అబుదాబి విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో తెలంగాణ వ్యక్తి గాయపడ్డాడు
Posted On 2026-03-05 06:04:46
Readmore >
సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ
Posted On 2026-03-04 23:23:12
Readmore >
స్త్రీ తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నిరూపించిన నాగ్పూర్కు చెందిన దీపాలి ఖోబ్రగడె
Posted On 2026-03-04 21:01:53
Readmore >
మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ
Posted On 2026-03-04 20:00:46
Readmore >
మస్జీద్ కాంప్లెక్స్లోని షాప్ నెంబర్ 5 కేటాయింపును వెంటనే రద్దు చేయాలి
Posted On 2026-03-04 18:30:50
Readmore >
కెన్నెడీ పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ పార్టీ... అభినందించిన పలువురు
Posted On 2026-03-04 16:19:10
Readmore >
38వ వార్డులో దొంగ ఓట్లపై విచారణ జరపాలి... రీపోలింగ్కు డిమాండ్
Posted On 2026-03-04 16:16:19
Readmore >
రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ
Posted On 2026-03-04 15:50:03
Readmore >