Posted on 2025-05-16 12:09:05
డైలీ భారత్, శ్రీహరికోట: ఈ ఏడాది జనవరిలో 100 రాకెట్ ప్రయోగాల మైలురాయిని అందుకున్న ఇస్రో తర్వాతి రాకెట్ లాంచ్కు సిద్ధమవుతోంది. ఈ నెల 18 (ఆదివారం)న శ్రీహరికోటలోని షార్ నుంచి పీఎస్ఎల్వీ-సి61ను ప్రయోగించనుండగా ఇది ఇస్రోకు 101వ రాకెట్ ప్రయోగం కానుంది. దీని ద్వారా భూ పరిశీలన ఉపగ్రహం (ఈఓఎస్) రిశాట్-18ను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. శనివారం ఉదయం 7.59 గంటలకు ఈ మిషన్ కౌంట్డౌన్ ప్రారంభం కానుంది. నిరంతరాయంగా 22 గంటలపాటు కొనసాగిన తర్వాత ఆదివారం ఉదయం 5:59 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ప్రయోగ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఇస్రో అధిపతి నారాయణన్ గురువారం షార్కు చేరుకున్నారు. అంతకుముందు ఆయన చెన్నైలో మాట్లాడుతూ.. దేశ భద్రత, ప్రజల అవసరాలే ప్రధాన లక్ష్యంగా ఇస్రో ప్రయోగాలు చేపడుతుందని, ఇతర దేశాలతో పోటీ పడదని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలకు కంప్యూటర్ అందజేసిన కెనరా బ్యాంకు మేనేజర్ వేగి శ్రీహరి
Posted On 2026-03-05 22:00:22
Readmore >
కరకగూడెం మండలం అశ్వాపురం పాడు గ్రామంలో వ్యక్తి దారుణ హత్య పలువురు అరెస్ట్
Posted On 2026-03-05 21:59:32
Readmore >
అబుదాబి విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో తెలంగాణ వ్యక్తి గాయపడ్డాడు
Posted On 2026-03-05 06:04:46
Readmore >
సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ
Posted On 2026-03-04 23:23:12
Readmore >
స్త్రీ తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నిరూపించిన నాగ్పూర్కు చెందిన దీపాలి ఖోబ్రగడె
Posted On 2026-03-04 21:01:53
Readmore >
మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ
Posted On 2026-03-04 20:00:46
Readmore >
మస్జీద్ కాంప్లెక్స్లోని షాప్ నెంబర్ 5 కేటాయింపును వెంటనే రద్దు చేయాలి
Posted On 2026-03-04 18:30:50
Readmore >