Posted on 2025-05-15 18:27:02
కృషి ఎప్పుడు వృధా కాదు.... కరస్పాండెంట్ జి భాస్కరరావు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: పాల్వంచ స్థానిక మార్కెట్ ఏరియాలో గల స్టార్ చిల్డ్రన్ హైస్కూల్ విద్యార్థులు షేక్ నుస్రత్ జి. నవ్య స్నేహిత ఇ. కార్తీక్ కుమార్ ఈ సంవత్సరం ప్రకటించిన ఎస్ ఎస్ సి ఫలితాలలో అద్భుత ప్రతిభను కనబరిచారు. సామాన్య కుటుంబం నుండి వచ్చిన ఈ విద్యార్థుల అద్భుత ప్రతిభకు స్పందించి దేశంలో ఫ్యాషన్ బ్రాండ్ రంగంలో అగ్రగామిగా నిలిచిన రిలయన్స్ ట్రెండ్స్ సంస్థ, స్థానిక శాఖ మేనేజర్ రవి రాజ్ స్టోర్ మేనేజర్ జి రవీంద్రబాబు బుధవారం సాయంత్రం వీరిని బహుమతులు, ప్రత్యేక మెడల్స్ తో ఘనంగా సత్కరించి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ జి భాస్కరరావు మాట్లాడుతూ సామాన్య కుటుంబీకులైన ఈ విద్యార్థులు చదువు ఎడల కనబరిచిన నిరంతర కృషి అంకిత భావం పట్టుదలను గుర్తించి స్పందించిన సంస్థ యాజమాన్యమునకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసినారు. కృషి ఎప్పుడూ వృధా కాదు అనే నానుడికి ప్రతిభావంతులైన తమ విద్యార్థులకు దక్కిన ఈ గౌరవం నిదర్శనమని ఇది వారు మరెన్నో విజయాలు సాధించుటకు తోడ్పడుతుందని, ఇలాంటి ఎంతో మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని కొనియాడారు. అనంతరం శాఖ సిబ్బంది కరస్పాండెంట్ ను ఘనంగా సన్మానించి విద్యా సేవారంగంలో తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు మహేశ్వరి, ప్రశాంతి విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >