| Daily భారత్
Logo




మే 20 న దేశ వ్యాపిత సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయండి

News

Posted on 2025-05-15 18:24:45

Share: Share


మే 20 న దేశ వ్యాపిత సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయండి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: 2025 మే 20న దేశ వ్యాపితంగా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు జరుగుతున్న సార్వత్రిక సమ్మె లో కార్మికులు అదిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని  ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టి యు సి ఐ) జిల్లా ఉపాధ్యక్షులు ఏదులాపురం గోపాలరావు పిలుపునిచ్చారు. 

గురువారం జూలూరుపాడు లో కార్మికుల తో కలిసి సమ్మె గోడ పత్రికల ను ఆవిష్కరించారు.అనంతరం గోపాలరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ఏధేచ్చగా అమలుకు పూనుకున్నదని ఆరోపించారు. 29 కార్మిక చట్టాలను నవీకరిస్తున్నామనే పేరుతో, గతంలో పోరాడి సాధించిన హక్కులను హరిస్తూ, “4 లేబర్ కోడ్స్” తీసుకురావడం జరిగిందని,వీటి అమలును నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేసారు. కనీస వేతనాలు 26 వేలు ఇవ్వాలని, కనీస ఈపీఎఫ్ పెన్షన్ 9 వేలు ఇవ్వాలని, స్కీం వర్కరన్స్ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ వర్కర్స్ ని రెగ్యులరైజ్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే సుప్రీం కోర్టు తీర్పు అమలు చేయాలని,ఆటో  మోటార్, హమాలీ వర్కర్స్ కి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, రైతాంగానికి కనీస మద్దతు ధరను ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించరాదనే డిమాండ్లతో కార్మిక వర్గం ఒక రోజు సమ్మె చేసి, నిరసన తెలుపుతున్నట్లు ఆయన తెలిపారు. 

ఈ కార్యక్రమంలో గంధం చంటి, నిమ్మటూరి గోపాలరావు, శ్రీను,నరేష్, ఇరు, రవి, తదితరులు పాల్గొన్నారు.

.

Image 1

బంగారం చోరీ కేసును చేధించిన పోలిసులు

Posted On 2026-05-03 20:42:05

Readmore >
Image 1

స్మశాన అభివృద్ధికి సదర్ సంఘం సమావేశం

Posted On 2026-05-03 18:13:51

Readmore >
Image 1

కామారెడ్డి లో భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-05-03 18:11:11

Readmore >
Image 1

కరీంనగర్‌లో కాల్పుల కలకలం

Posted On 2026-05-03 13:56:46

Readmore >
Image 1

ఢిల్లీలో పేలిన ఏసీ.. తొమ్మిది మంది మృతి

Posted On 2026-05-03 11:50:01

Readmore >
Image 1

హైదరాబాద్ లో దారుణమైన ఘటన...మరో హిట్ అండ్ రన్ కేసు..!

Posted On 2026-05-03 11:18:35

Readmore >
Image 1

అబ్దుల్ కలాం ఫౌండేషన్ లో దమ్మన్నపెట్ విధ్యార్థులు

Posted On 2026-05-03 00:00:34

Readmore >
Image 1

గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-05-02 23:56:32

Readmore >
Image 1

మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-05-02 23:48:08

Readmore >
Image 1

చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

Posted On 2026-05-02 23:19:44

Readmore >