Posted on 2025-05-15 18:18:19
అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం అబ్బుగూడెం గ్రామంలో ఈరోజు కరెంట్ షాక్ తో మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన తుడుం దెబ్బ నాయకులు తంబల్ల రవి,వారు మాట్లాడుతూ అబ్బుగూడెం గ్రామానికి చెందిన మామిడి రెమెల్యా (24)అనే యువతి అన్నపూరెడ్డి పల్లి ధాన్యం మార్కెట్ యార్డ్లో రోజువారీగా పనికి వెళ్లి కరెంటు షాక్ తగిలి మరణించడం చాలా బాధాకరం,ఇది అధికారుల నిర్లక్ష్యం వల్లే యువతి మరణించడం జరిగినది,నీరు పేద కుటుంబ వాళ్ళది,అందరూ ఆడపిల్లలే,తల్లి,తండ్రి లేరు,కూలి పని చేసుకొని బ్రతికే కుటుంబంలో ఇలా జరగటం చాలా బాధాకరం,ధాన్యం యార్డ్ లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం స్పందించి మృత కుటుంబానికి ప్రభుత్వం తరఫు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు,
ఈ కార్యక్రమంలో మహిళా మండలి జిల్లా అధ్యక్షురాలు షేక్ జాన్ బి, మాజీ ఎంపీటీసీ కుర్రం రాము,గ్రామస్తులు పాల్గొన్నారు.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >