Posted on 2025-05-10 11:12:00
భద్రాచలం చెక్పోస్ట్ వద్ద 29.500 కేజీల గంజాయి పట్టివేత.
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా /భద్రాచలం: ఒరిస్సా మల్కాన్ గిరి జిల్లా నుంచి హైదరాబాద్ కు కారులో గంజాయిని తరలిస్తున్నట్లు అందుకున్న సమాచారం మేరకు భద్రాచలం ఎక్సైజ్ పోలీసులు చెక్పోస్ట్ వద్ద ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అనుమానం వచ్చినటువంటి కారును నిలిపి లోపల పరిశీలించగా అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. గంజాయిని బయటకు తీసి తూకం వేయగా 29.500 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించినట్లు భద్రాచలం సిఐ రహీం ఉన్నిసా బేగం తెలిపారు.
పట్టుకున్న గంజాయి విలువ రూ. 14 లక్షల 50 వేలు ఉంటుందని అంచనా వేశారు. ఈ కేసులో కడపకు చెందిన సాయి కృష్ణ, పవన్ రెడ్డి, హైదరాబాదు కు చెందిన శ్రీహరి అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.
గంజాయితో పాటు కారును కూడా సీజ్ చేసినట్లు సిఐ పేర్కొన్నారు. గంజాయిని పట్టుకున్న కేసులో
అసిస్టెంట్ కమిషనర్ కరంచంద్ సీఐ రహీం మున్నీసా బేగం సిబ్బంది ఉన్నారు.
గంజాయిని పట్టుకున్నటువంటి భద్రాచలం పోలీసుల ను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం ఎక్సైజ్ సూపరిండెంట్ జానయ్యలు అభినందించారు.
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >
జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Posted On 2026-04-27 19:27:31
Readmore >