| Daily భారత్
Logo




ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో భూ ప్రకంపనలు.. పరుగులు తీసిన ప్రజలు

News

Posted on 2025-05-05 23:06:00

Share: Share


ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో భూ ప్రకంపనలు.. పరుగులు తీసిన ప్రజలు

డైలీ భారత్, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా భూప్రకంపనలు సంభవించాయి. జగిత్యాల, వేములవాడ, కరీంనగర్ ప్రాంతాల్లో ఒక్కసారిగా భూమి కంపించింది.

ధర్మపురి, సిరిసిల్ల, సుల్తానాబాద్‍లోనూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై 3.5గా భూకంప తీవ్రత నమోదైంది. దాదాపు ఐదు సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు తీవ్రభయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోని సామగ్రి సైతం కదిలిపోవడంతో ఏ జరుగుతుందో అర్థంకాక భయంతో బయటకు పరుగులు తీశారు. ఉమ్మడి జిల్లాలో నాలుగు నెలల వ్యవధిలో ఇలా భూమి కంపించడం రెండోసారి కావడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరి ముఖ్యంగా చొప్పదండి, గంగాధర, రామడుగు మండలాల్లో కొన్ని సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చాయి. అలాగే నిర్మల్‌ జిల్లాలోనూ పలు చోట్ల భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లు సమాచారం.

Image 1

తినగ తినగ మునగ మేలు చేయు

Posted On 2026-04-27 14:18:29

Readmore >
Image 1

దమ్మపేటలో ఘనంగా భారత రాష్ట్ర సమితి (BRS)పార్టీ అవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-04-27 14:12:14

Readmore >
Image 1

ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

Posted On 2026-04-27 14:10:31

Readmore >
Image 1

పదేళ్లలో ప్రజలకు సుపరిపాలన అందించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్

Posted On 2026-04-27 14:09:19

Readmore >
Image 1

ప్రభుత్వ పథకాలు వేగవంతం చేయాలి

Posted On 2026-04-27 14:07:10

Readmore >
Image 1

లేమామిడిలో అంబరాన్నంటిన బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

Posted On 2026-04-27 13:02:36

Readmore >
Image 1

ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-04-27 12:59:21

Readmore >
Image 1

మొగలపల్లిలో సీనియర్ కమ్యూనిస్టు నాయకులు వెంకటరావుకు ఘన సన్మానం

Posted On 2026-04-27 10:36:06

Readmore >
Image 1

ప్రేమ పేరుతో మోసం… యువతి ఆత్మహత్య

Posted On 2026-04-27 08:03:32

Readmore >
Image 1

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు

Posted On 2026-04-26 18:36:22

Readmore >