| Daily భారత్
Logo




ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఆపరేషన్‌1000 మంది మావోయిస్టులను చుట్టుముట్టిన 20వేల బలగాలు

News

Posted on 2025-04-24 17:20:15

Share: Share


ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఆపరేషన్‌1000 మంది మావోయిస్టులను చుట్టుముట్టిన 20వేల బలగాలు

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఆపరేషన్‌1000 మంది మావోయిస్టులను చుట్టుముట్టిన 20వేల బలగాలు

ఛత్తీస్‌గఢ్‌ అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్‌ కొనసాగుతోంది.

డైలీ భారత్, చత్తీస్గడ్: ఛత్తీస్‌గఢ్‌లో అతిపెద్ద యాంటీ-నక్సల్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది. బీజాపుర్‌ అడవుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు నక్కినట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు కూంబింగ్‌ చేపట్టాయి. దాదాపు 1000 మంది మావోయిస్టులను సుమారు 20వేల మంది భద్రతా సిబ్బంది చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గురువారం ఉదయం ధర్మతాళ్లగూడెం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. 

బీజాపుర్‌ జిల్లా ఊసూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోకి వచ్చే కర్రెగుట్టల కేంద్రంగా అగ్రనేతలు, మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నారనే సమాచారంతో కేంద్ర పారామిలటరీ బలగాల నేతృత్వంలో ఈ ఆపరేషన్‌ చేపట్టారు. కర్రెగుట్టలలో దాదాపు 1000 మంది మావోయిస్టులు దాగి ఉన్నట్లు సమాచారం. అగ్రనేత హిడ్మా నేతృత్వంలో వీరంతా అక్కడకు చేరినట్లు తెలుస్తోంది. వీరిలో కమాండర్‌ స్థాయి నేతలు, మావోయిస్టు అగ్ర నాయకులు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చింది. దీంతో ఈ ప్రాంతంలో కూంబింగ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. భీమవరంపాడు, పూజారీ కాంకేర్‌, పామేడు అటవీ ప్రాంతాల్లో కాల్పుల మోత మోగుతోంది. కూంబింగ్‌ నేపథ్యంలో కర్రెగుట్ట దండకారణ్యంలోని పలు గ్రామాలకు రాకపోకలను నిలిపివేశారు.

గాలింపు చర్యల్లో డీఆర్‌జీ బస్తర్ ఫైటర్ కోబ్రా, సీఆర్పీఎఫ్‌, ఎస్టీఎఫ్‌ సైనికులతో పాటు ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు పాల్గొన్నారు. 48 గంటలుగా ఈ కూంబింగ్‌ కొనసాగుతోంది. మందుపాతరలు అమర్చామని ఇప్పటికే మావోయిస్టులు లేఖల ద్వారా ప్రకటించారు. ప్రజలెవరూ అటవీ ప్రాంతంలోకి రావొద్దని హెచ్చరించారు. దీంతో గాలింపు అత్యంత అప్రమత్తంగా కొనసాగుతోంది. బుధవారం నాటికి 3 వేల మందితో కూంబింగ్‌ చేపట్టగా.. గురువారం ఉదయం అదనంగా మరో 2 వేల మందిని రప్పించారు. దీంతో ఈ 5 వేల మంది భద్రతా సిబ్బంది కర్రెగుట్టల అటవీప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు సమాచారం. అయితే, భద్రతా బలగాల సంఖ్య 20వేల వరకు ఉంటుందని పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. బస్తర్‌, అబూజ్‌బడ్‌ దండకారణ్యంపై హిడ్మాకు పూర్తి అవగాహన ఉంది. అతడి టార్గెట్‌గానే ఈ ఆపరేషన్‌ చేపట్టినట్లు సమాచారం. హిడ్మాతో పాటు మావోయిస్టు బెటాలియన్‌ చీఫ్‌ దేవాను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.

Image 1

సిరిసిల్ల జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు

Posted On 2026-03-13 22:52:56

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆన్‌లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి మోసాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్

Posted On 2026-03-13 19:19:09

Readmore >
Image 1

పదవ తరగతి వార్షిక పరీక్షలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

Posted On 2026-03-13 19:10:41

Readmore >
Image 1

ఏసీబీ కి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

Posted On 2026-03-13 18:06:25

Readmore >
Image 1

రోడ్డు నియమ నిబంధనలు పాటించాలి : ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం

Posted On 2026-03-13 17:42:24

Readmore >
Image 1

ఎల్.పి.జి గ్యాస్ కొరత లేదు : కలెక్టర్ సి. నారాయణ రెడ్డి

Posted On 2026-03-13 17:35:18

Readmore >
Image 1

సైబర్ కేటుగాళ్లను హడలెత్తిస్తున్న తెలంగాణ పోలీసులు.. 117 మంది అరెస్ట్!

Posted On 2026-03-13 17:33:46

Readmore >
Image 1

కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు సందర్భంగా పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసిన జాగృతి శ్రేణులు

Posted On 2026-03-13 16:46:49

Readmore >
Image 1

అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-03-13 16:41:37

Readmore >
Image 1

అక్రమంగా నిల్వచేసిన 41 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేసిన సూర్యపేట పోలీస్

Posted On 2026-03-13 16:39:38

Readmore >