Posted on 2025-04-24 11:34:40
డైలీ భారత్, హైదరాబాద్: ఈ ఏడాది దేశీయ మార్కెట్లో సిమెంట్ ధరలు పెరగనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో సిమెంట్ ధరలు 2 నుంచి 4 శాతం (రూ.15-20) మేరకు పెరిగే అవకాశం ఉన్నట్టు ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ, విశ్లేషణ సంస్థ క్రిసిల్ తాజా రిపోర్టులో అంచనా వేసింది.
కేంద్ర ప్రభుత్వం ప్రధాన మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖ, గ్రామీణ హౌసింగ్ ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపులు 10 శాతం పెంచిన నేపథ్యంలో సిమెంట్ రంగంలో డిమాండ్ 6.5-7.5 శాతం పెరుగుతుందని క్రిసిల్ పేర్కొంది.
బడ్జెట్ కేటాయింపులతో పాటు ఈ ఏడాది రుతు పవనాలు సానుకూలంగా ఉండటం, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు స్పీడ్ అందుకుంటాయని, తద్వారా సిమెంట్ రంగం లో గిరాకీ ఊపందుకుం టుందని క్రిసిల్ తన ఇంటిలిజెన్స్ నివేదికలో వెల్లడించింది.
గతేడాది నిరాశపరిచిన ఇండస్ట్రీ గత ఆర్థిక సంవత్సరం (2024-25) సిమెంట్ ఇండస్ట్రీకి అంతగా కలిసిరాలేదు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే సిమెంట్ పరిశ్రమలో వృద్ధిరేటు 4.5-5.5 శాతంగానే కొనసాగింది.
దీనిని లోక్సభ ఎన్నికలు, భారీ వర్షాలు కారణమని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఒక దశలో ప్రముఖ కంపెనీల 50 కిలోల సిమెంట్ బస్తా రూ.300కి కూడా పడిపోయింది. ప్రసుతం కోలుకుని రూ.350 నుంచి రూ.360 మధ్య ట్రేడవుతోంది.
ప్రధానంగా ప్రధానమైన 12 రాష్ట్రాలు ప్రకటించిన తమ బడ్జెట్ల కారణంగా దేశీయ సిమెంట్ డిమాండ్లో 63.65 శాతం భర్తీ చేయనున్నాయి. ఇది సిమెంట్ రంగానికి సానుకూలమని, గిరాకీ పుంజుకునేందుకు దోహదపడుతుందని క్రిసిల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ సెహుల్ భట్ చెప్పారు.
జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-26 19:31:31
Readmore >
రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి
Posted On 2026-06-26 19:19:45
Readmore >
మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ
Posted On 2026-06-26 12:01:33
Readmore >
రూ. 87 లక్షల అక్రమాస్తులు... వేములవాడ మాజీ ఎస్హెచ్ఓ ప్రస్తుత “కరీంనగర్ ఎక్సైజ్ సీఐ”పై ఏసీబీ కేసు
Posted On 2026-06-25 21:51:45
Readmore >