Posted on 2025-04-19 10:52:41
ముస్తఫాబాద్లో ఈ తెల్లవారుజామున కూలిన భవనం
శిథిలాల కింద మరో 10 మంది
కొనసాగుతున్న సహాయక చర్యలు
డైలీ భారత్, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ముస్తఫాబాద్లో నాలుగంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో నలుగురు మృతి చెందారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఈ తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, జాతీయ విపత్తు నిర్వహణ అధికారులు (ఎన్డీఆర్ఎఫ్) సహాయక చర్యలు ప్రారంభించారు.
భవనం కూలిన ఘటనలో నలుగురు మృతి చెందారని, మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారని పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఘటన జరిగిందని, ఇప్పటి వరకు 14 మందిని రక్షించామని, వారిలో నలుగురు తీవ్ర గాయాలతో మృతి చెందారని తెలిపారు. శిథిలాల కింద ఇంకా 8-10 మంది చిక్కుకుని ఉన్నారని వివరించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లా పొతంగల్ ఖుర్ద్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలలో వినూత్న తీర్పు ఇచ్చిన ఓటర్లు
Posted On 2025-12-14 20:40:04
Readmore >
వల్లభాపూర్ గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పెరుమళ్ళ గంగయ్య గెలుపు
Posted On 2025-12-14 18:15:57
Readmore >
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో బోనీ కొట్టిన కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బస్సి సునీత
Posted On 2025-12-14 17:52:51
Readmore >
విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పై వీరంగం సృష్టించిన మద్యం మత్తులో ఉన్న ఆటో డ్రైవర్
Posted On 2025-12-14 14:54:09
Readmore >