Posted on 2025-04-04 07:47:43
డైలీ భారత్, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వక్ఫ్ (సవరణ) బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 128, వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. కాగా, లోక్సభలో సజావుగా ఆమోదం పొందిన వక్ఫ్ బిల్లు.. 24 గంటల తర్వాత ఎగువ సభలో కూడా ఆమోదం పొందడం విశేషం. సుదీర్ఘ చర్చ అనంతరం రాజ్యసభలో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. అర్ధారాత్రి దాటేవరకూ సభలో విస్తృత చర్చ జరిగింది.
మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వక్ఫ్ బిల్లుపై చర్చను ప్రారంభిస్తూ, బిల్లు ముస్లిం ప్రయోజనాలకు హాని కలిగిస్తుందనే ఆరోపణలను తోసిపుచ్చారు. వక్ఫ్ బోర్డు నిర్వహణ, సృష్టి, లబ్ధిదారులు అంతా ముస్లింలే ఉంటారని, ముస్లిమేతరులు దాని వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేరని నొక్కి చెప్పారు.
ఈ బిల్లు మతానికి సంబంధించినది కాదన్న మంత్రి... ఆస్తి, దాని నిర్వహణకు సంబంధించినదని, అవినీతిని నిర్మూలించడమే లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు. ఒక ఆస్తిని వక్ఫ్గా ప్రకటించే ముందు యాజమాన్య రుజువు అవసరం అవుతుందని ఆయన అన్నారు.
ఇక చర్చ సందర్భంగా మంత్రి రిజిజు, మరో కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న వక్ఫ్ లేబుల్ చేయబడిన ఆస్తుల జాబితాను ప్రకటించారు. వాటిలో ఢిల్లీలోని లుటియెన్స్ జోన్లోని ఆస్తులు, తమిళనాడులోని 400 సంవత్సరాల పురాతన ఆలయం, ఫైవ్ స్టార్ స్థాపన కోసం భూమి, పాత పార్లమెంట్ భవనం కూడా ఉన్నాయి.
కాగా, లోక్సభలో వక్ఫ్ బిల్లుకు మొత్తం 282 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయగా, 232 మంది దీనిని వ్యతిరేకించిన విషయం తెలిసిందే. 12 గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ చర్చ అనంతరం, అర్ధరాత్రి తర్వాత స్పీకర్ ఓం బిర్లా బిల్లుపై ఓటింగ్ నిర్వహించడం, ఆమోదం పొందడం జరిగింది.
పార్లమెంట్లో ఆమోదం పొందిన ఈ బిల్లు తదుపరి రాష్ట్రపతి ఆమోదానికి పంపించడం జరుగుతుంది. అక్కడ ఆమోదం పొందిన తర్వాత చట్టంగా మారుతుంది. ఈ ప్రతిపాదిత చట్టం వక్ఫ్ ఆస్తులను నియంత్రించే 1995 చట్టాన్ని సవరించడం లక్ష్యంగా పెట్టుకుంది.
కూలీలను కబళించిన ప్రమాదం.. టైరు పేలడంతో బోల్తాపడ్డ టాటా ఏస్, ముగ్గురు మృతి
Posted On 2026-06-23 12:14:31
Readmore >
నిజామాబాద్ లో ఎక్సైజ్ సూపరిండెంట్ ఇంట్లో ఏసీబీ అధికారుల దాడుల కలకలం
Posted On 2026-06-23 11:59:52
Readmore >
ఒలింపిక్ స్ఫూర్తిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి : మంత్రి వాకిటి శ్రీహరి
Posted On 2026-06-23 11:09:19
Readmore >
పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్
Posted On 2026-06-22 21:29:25
Readmore >
నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్
Posted On 2026-06-22 21:24:09
Readmore >
ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది
Posted On 2026-06-22 20:54:00
Readmore >
చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ
Posted On 2026-06-22 20:51:08
Readmore >