Posted on 2026-06-23 11:59:52
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో అవినీతి విరోధక శాఖ అధికారుల బృందాల దాడులు కలకలం సృష్టించాయి. నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ కె. మల్లారెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు వచ్చినట్టు తెలిసింది. దీంతో మంగళవారం ఉదయం నుండి ఏసీబీ డిఎస్పి శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఉదయం నుండి దాడులు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ ప్రాంతంలో గల ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం తో పాటు నగరంలోని ప్రగతి నగర్ లో ఈఎస్ నివాసముండే ఆయన ఇంటిపై ఏకధాటిగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ కార్యాలయంలోని కొన్ని డాక్యుమెంట్లను ఏసీబీ బృందం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దీంతోపాటు ఈఎస్ ఇంట్లో నుంచి పలు రికార్డులతో పాటు ఇతర విలువైన వస్తువులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అనంతరం ఈఎస్ మల్లారెడ్డిని ఏసీబీ అధికారులు తమ వెంట తీసుకువెళ్లి విచారణ నిర్వహిస్తున్నారు. అలాగే హైదరాబాద్ నగరంలో ఉన్న ఈఎస్ ఇంటిపై సైతం ఏసీబీ అధికారుల బృందం దాడి చేసి అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
కూలీలను కబళించిన ప్రమాదం.. టైరు పేలడంతో బోల్తాపడ్డ టాటా ఏస్, ముగ్గురు మృతి
Posted On 2026-06-23 12:14:31
Readmore >
నిజామాబాద్ లో ఎక్సైజ్ సూపరిండెంట్ ఇంట్లో ఏసీబీ అధికారుల దాడుల కలకలం
Posted On 2026-06-23 11:59:52
Readmore >
ఒలింపిక్ స్ఫూర్తిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి : మంత్రి వాకిటి శ్రీహరి
Posted On 2026-06-23 11:09:19
Readmore >
పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్
Posted On 2026-06-22 21:29:25
Readmore >
నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్
Posted On 2026-06-22 21:24:09
Readmore >
ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది
Posted On 2026-06-22 20:54:00
Readmore >
చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ
Posted On 2026-06-22 20:51:08
Readmore >
సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి
Posted On 2026-06-22 20:50:12
Readmore >