Posted on 2025-03-24 17:00:50
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఎంపీడీవో ఆఫీసులో చర్ల పంచాయతీ సెక్రటరీ సురేష్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.చర్ల గ్రామపంచాయతీలో ది: 26/ 3/ 2025 నాడు బహిరంగ సంత వేలం పాట నిర్వహించుటకు సంబంధిత అధికారులు షెడ్యూల్ విడుదల చేశారని ఈ యొక్క సంత వేలంపాట షెడ్యూల్ ఏరియా పీసా చట్టం రూల్స్ ప్రకారంగా నిర్వర్తించి ఆదివాసి నిరుద్యోగులకు అవకాశం కల్పించి ఉపాధి పొందే విధంగా అధికారులు కృషి చేయాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ సూచించారు
ప్రతి సంవత్సరం పాట సమయంలో అమాయక గిరిజనులను పట్టుకొని వారి ద్వారాగా గిరిజనుల తరుపున డీడీలు కట్టించి పాటలో పాల్గొని బినామీలుగా చలామనీ అవుతున్నారని అలాంటి వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈసారి బినామీలు సంతలో ప్రవేశిస్తే మాత్రం ఆదివాసులు తిరగబడి కట్టడి చేస్తారని అధికారులు కూడా ఏజెన్సీ రూల్స్ ప్రకారంగా సంత వేలంపాట నిర్వర్తించి పూర్తిగా ఆదివాసులు ఉపాధి పొందే విధంగా పాటను నిర్వర్తించి వాళ్ళకి న్యాయం చేయాలని కోరారు వినతిపత్రం ఇచ్చిన వారిలో పూనెం వరప్రసాద్, జీఎస్పి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇర్ఫా ప్రకాష్,స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర నాయకులు శరమ్ రవీంద్ర పాల్గొన్నారు.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >