Posted on 2025-03-24 17:00:50
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఎంపీడీవో ఆఫీసులో చర్ల పంచాయతీ సెక్రటరీ సురేష్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.చర్ల గ్రామపంచాయతీలో ది: 26/ 3/ 2025 నాడు బహిరంగ సంత వేలం పాట నిర్వహించుటకు సంబంధిత అధికారులు షెడ్యూల్ విడుదల చేశారని ఈ యొక్క సంత వేలంపాట షెడ్యూల్ ఏరియా పీసా చట్టం రూల్స్ ప్రకారంగా నిర్వర్తించి ఆదివాసి నిరుద్యోగులకు అవకాశం కల్పించి ఉపాధి పొందే విధంగా అధికారులు కృషి చేయాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ సూచించారు
ప్రతి సంవత్సరం పాట సమయంలో అమాయక గిరిజనులను పట్టుకొని వారి ద్వారాగా గిరిజనుల తరుపున డీడీలు కట్టించి పాటలో పాల్గొని బినామీలుగా చలామనీ అవుతున్నారని అలాంటి వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈసారి బినామీలు సంతలో ప్రవేశిస్తే మాత్రం ఆదివాసులు తిరగబడి కట్టడి చేస్తారని అధికారులు కూడా ఏజెన్సీ రూల్స్ ప్రకారంగా సంత వేలంపాట నిర్వర్తించి పూర్తిగా ఆదివాసులు ఉపాధి పొందే విధంగా పాటను నిర్వర్తించి వాళ్ళకి న్యాయం చేయాలని కోరారు వినతిపత్రం ఇచ్చిన వారిలో పూనెం వరప్రసాద్, జీఎస్పి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇర్ఫా ప్రకాష్,స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర నాయకులు శరమ్ రవీంద్ర పాల్గొన్నారు.
ఉర్దూ అకాడమీ చైర్మన్ కుమారుని రిసెప్షన్ వేడుకకు హాజరైన టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:06:39
Readmore >
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే నిర్వహించిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:05:41
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు
Posted On 2025-12-07 19:45:50
Readmore >
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >
పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
Posted On 2025-12-07 17:30:34
Readmore >