Posted on 2025-02-02 19:15:44
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో నిధుల కేటాయింపులు చేయకపోవడం పట్ల రాష్ట్ర కాంగ్రెస్ హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై ఆదివారం నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ కాంగ్రెస్ నాయకులు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, మొహమ్మద్ ఇబ్రహీం, రఘు నాయక్, డంగు శ్రీనివాస్, తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి, శివశంకర్ గౌడ్, అలీం సకిబ్, తాండ్ర శ్రావణ్ రెడ్డి,తదితరులు పాల్గొని ప్లకార్డు ప్రదర్శించి తెలంగాణకు కేంద్ర బడ్జెట్లో కేటాయింపులేవి అని నిరసన తెలిపారు.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నిధుల కేటాయింపులు అలసత్వం ప్రదర్శిస్తుందని విమర్శించారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందున, రాష్ట్రానికి నిధుల కేటాయింపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని అన్నారు. రాష్ట్రం నుంచి జిఎస్టి రూపంలో అధిక నిధులు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం. ప్రజల సంక్షేమం కోసం బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం శోచనీయమన్నారు. తెలంగాణ నుంచి ఎనిమిది మంది ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న బడ్జెట్లో ఎందుకు నిధులు కేటాయింపు చేయించలేకపోయారో తెలుపాలని డిమాండ్ చేశారు..
హైదరాబాద్లో పారిశుధ్య సమస్యలను నివేదించడానికి వాట్సాప్ సౌకర్యం ప్రవేశపెట్టబడింది
Posted On 2026-03-12 21:53:55
Readmore >
శుక్రవారం నాడు అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు బేబీ కిట్స్ పంపిణీ కార్యక్రమం
Posted On 2026-03-12 21:52:35
Readmore >
కామారెడ్డిలో ఫ్లయింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలి : కాటిపల్లి వెంకట రమణ రెడ్డి
Posted On 2026-03-12 18:49:30
Readmore >
కామారెడ్డి జిల్లా గురువారం పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-03-12 18:47:14
Readmore >
బిజెపి నుండి గెలిచిన 16 మంది కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ ల కు సన్మానం చేసిన బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతరాజు వెంకటేశ్ పెరిక
Posted On 2026-03-12 18:45:43
Readmore >