Posted on 2024-12-28 07:37:55
డైలీ భారత్, తెలంగాణ డెస్క్:ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. దర్యాప్తు ప్రారంభించింది. కేటీఆర్ కు ఇంకా నోటీసులు జారీ చేయలేదు. కానీ ఏసీబీ కేసు ఆధారంగా కేసు పెట్టిన ఈడీ మాత్రం ఆగడంలేదు. వెంటనే నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ రేసు విషయంలో డబ్బులు విదేశాలకు తరలించిన వ్యవహారంలో జనవరి 7 న ఈడీ విచారణ కు హాజరు కావాలని కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది.
ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిలకు కూడా ఈనోటీసులు అందాయి. వీరిని ముందే రావాలని ఆదేశించింది. జనవరి 2, 3 తేదీల్లో వీరు విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద విచారణ చేస్తున్న ఈడీ.. పెమా నిబంధనలు ఉల్లగింన జరిగినట్లు ఇప్పటికే గుర్తించినట్లుగా తెలుస్తోంది. FEO కు 55 కోట్లు నగదు బదిలీ , ఆర్థిక పరమైన అవకతవకలు జరిగినట్లు ఈడీ కేసు పెట్టింది.
తెలంగాణ ఏసీబీ పెట్టింది అవినీతి కేసు. అక్కడ అవినీతి లేదని కేటీఆర్ వాదిస్తున్నారు. ఈడీ పెట్టింది డబ్బుల అక్రమ తరలింపు కేసు . కేటీఆర్ ఇలా తరలిపోయిందని అంగీకరిస్తున్నారు. అయితే తనకు సంబంధం లేదంటున్నారు. ఈ విషయాన్ని ఈడీ తేలుస్తుంది. మొత్తంగా ఏసీబీ కన్నా ఈడీనే దూకుడుగా ఉండటం బీఆర్ఎస్ క్యాంప్నకు ఆందోళన కలిగించేదే.
సదాశివనగర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-29 16:22:04
Readmore >
వర్షాల వేళ అప్రమత్తంగా కామారెడ్డి పోలీసులు – ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు
Posted On 2026-07-29 16:19:52
Readmore >
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు... ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
Posted On 2026-07-29 16:14:43
Readmore >
ఎమ్మార్పీఎస్ కామారెడ్డి నియోజకవర్గ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన జిల్లా ఇన్చార్జ్
Posted On 2026-07-29 08:54:06
Readmore >
చింతపూడి యుగంధర్ పార్దివదేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎడవల్లి కృష్ణ
Posted On 2026-07-29 08:52:51
Readmore >