| Daily భారత్
Logo




తెలంగాణ లో విద్యార్ధి విజయోత్సవాలు : ఎన్.ఎస్.యు.ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు అజ్మీర సురేష్ నాయక్

News

Posted on 2024-11-04 19:00:25

Share: Share


తెలంగాణ లో విద్యార్ధి విజయోత్సవాలు : ఎన్.ఎస్.యు.ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు అజ్మీర సురేష్ నాయక్

విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం

ఇంటిని మరిపించేలా కొత్త డైట్ మరియు కాస్మెటిక్ ఛార్జీలు పెంపు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం నియోజకవర్గంలోని నవభారత్ మైనార్టీ గురుకుల పాఠశాలో సీఎం రేవంత్ రెడ్డి మరియు డిప్యూటీ సీఎం అధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు చిత్రపటానికి పాలాభిషేకం చేసి హర్షం తెలియజేసిన విద్యార్థులు మరియు విద్యార్థి నాయకులు. ఈ సందర్భంగా ఎన్.ఎస్.యు.ఐ జిల్లా అధ్యక్షులు అజ్మీర సురేష్ నాయక్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా సంక్షేమ గురుకులాలు, వసతి గృహాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ఇక నుండి "ప్రజా పాలన" లో నాణ్యమైన పౌష్టికాహారం అందనుంది. ఇందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటిని మరిపించేలా బలవర్ధకమైన ఆహారాన్ని అందించేందుకు కొత్త డైట్ ను సిద్ధం చేసింది. డైట్, కాస్మోటిక్ చార్జీల పెంపు విద్యార్థులకు మరింత మేలు చేకూరుతుంది. గత ప్రభుత్వం అరకొరగా పెంచి నిర్లక్ష్యం వహించింది. సీఎం రేవంత్ రెడ్డి మరియు డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రివర్యులు బట్టి విక్రమార్క మల్లు విద్యార్థుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వ విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. యూనివర్సిటీల వీసీల నియామకంతో పాటు విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించే దిశగా నూతనంగా స్కిల్ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టారు. ఇచ్చిన మాటకు కట్టుబడి జాబ్ క్యాలెండర్ ను ప్రకటించి కాంగ్రెస్ కొలువుల జాతరను కొనసాగిస్తుంది.

విద్యార్థులకు భరోసానిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసారు కార్యక్రమంలో జినుగు అరుణ్, భూక్యా కళ్యాణ్, అఖిల్, మహేష్, సమీర్, తదితరులు పాల్గొన్నారు....

Image 1

ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు

Posted On 2026-04-22 12:20:38

Readmore >
Image 1

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం

Posted On 2026-04-22 10:42:24

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన మహిళ సీఐ మరియు ఎస్ఐ

Posted On 2026-04-22 07:35:51

Readmore >
Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-04-21 19:56:02

Readmore >
Image 1

జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి

Posted On 2026-04-21 19:53:11

Readmore >
Image 1

సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-04-21 18:31:56

Readmore >
Image 1

జిల్లాలో ఒకే రోజు 58 మందికి కోర్టు శిక్షలు

Posted On 2026-04-21 18:28:04

Readmore >
Image 1

హాస్టల్ విద్యార్థుల సమస్యలపై ఏబీవీపీ ఆందోళన

Posted On 2026-04-21 18:25:47

Readmore >
Image 1

బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-04-21 17:08:06

Readmore >
Image 1

ఐవిఎఫ్ మరియు కామారెడ్డి రక్తదాతల సమూహ సేవలు అభినందనీయం

Posted On 2026-04-21 17:02:20

Readmore >