Posted on 2024-11-04 16:15:24
డైలీ భారత్, తెలంగాణ డెస్క్: సర్పంచ్ లకు బకాయిల పైన బీఆర్ఎస్ పార్టీ, హరీష్ రావు ముసలి కన్నీరు కారుస్తున్నారు అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
అధికారం పోయాక సర్పంచ్ లపైన బీఆర్ఎస్ నేతలు ఎక్కడ లేని ప్రేమ చూపిస్తున్నారు.
బీఆర్ఎస్ హయాంలో సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకున్నారు.
పదుల సంఖ్యలో సర్పంచ్ లు ఆత్మహత్య చేసుకొని చనిపోయినా ఆ కుటుంబాలను హరీష్ రావు ఏ నాడు పరామర్శించలేదు.
గ్రామాల్లో అభివృద్ధి పనుల పేరుతో సర్పంచ్ లతో లక్షలు ఖర్చు పెట్టించింది కేసీఆర్ సర్కార్.
సర్పంచ్ ల గొంతు పైన కత్తి పెట్టి రైతు వేదికలు, స్మశాన వాటికలు కట్టించారు.
సమయానికి పనులు చేయలేదని సర్పంచ్ లను సస్పెండ్ చేశారు.. మానసికంగా, ఆర్థికంగా చితికి పోయేలా చేశారు..
కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సంఘం నిధులను కూడా దారి మళ్లించి పంచాయతీ ల పొట్ట కొట్టారు.
కేసీఆర్ తన గొప్ప కోసం పంచాయతీ లను ఆర్థికంగా దారుణంగా దెబ్బతీశారు.
కేసీఆర్ ప్రభుత్వం చేసిన పాపాలను ఒక్కొక్కటి కడుగుకుంటు వస్తున్నాం..
40 వేల కోట్ల కు పైగా బకాయిలు పెట్టి పోయారు ఇప్పుడు ఆ బకాయిలను తీర్చడానికి మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది.
హరీష్ రావు ముందు సర్పంచ్ ల కాళ్లు పట్టుకొని క్షమాపణ అడగాలి... అప్పుడే బకాయి లపైన మాట్లాడే నైతిక హక్కు ఉంటుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >