Posted on 2024-10-21 11:27:01
డైలీ భారత్, బాచుపల్లి: బాచుపల్లి నారాయణ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అనూష దసరా సెలవులకు వెళ్లి... తిరిగి హాస్టల్కు వచ్చి సూసైడ్ చేసుకుంది. తల్లిదండ్రులు దగ్గరుండి హాస్టల్లో వదిలి వెళ్లిన కాసేపటికే బలవన్మరణానికి పాల్పడింది. హాస్టల్లో వదిలి.. సిటీ దాటే లోపే అనూష స్పృహ కోల్పోయిందని కాలేజీ యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం అందించింది.
అయితే వారు కాలేజీకి వెళ్లే సరికి అనూష ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని యాజమాన్యం తెలిపింది. అంతేకాకుండా ఆమె తల్లిదండ్రులు వచ్చేలోపే కళాశాల సిబ్బంది, బాచుపల్లి పోలీసులు అనూష మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇక, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-04-25 08:24:31
Readmore >
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >