డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా ప్రొఫెసర్. వి. బాలకృష్ణ రెడ్డి, వైస్ చైర్మన్ గా ప్రొఫెసర్. ఇటిక్యాల పురుషోత్తం నీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సందర్భంగా శనివారం నాడు హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో వీరిని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య, జేఎన్టీయుహెచ్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మంద రంజిత్ కుమార్ మరియు జాక్ కమిటీ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మంద రంజిత్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచంతో పోటీ పడాలంటే రాష్ట్రంలో జాతీయ విద్యా విదానాన్ని అమలు చేయాలని అలాగే ఉన్నత విద్యాభివృద్దిలో కాలానుగుణంగా మార్పులు తీసుకొచ్చేందుకు కృషి చేయాలని ఈ మేరకు కోరారు. ఈ అభినందన కార్యక్రమంలో ఎమ్మార్పిస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ, జేఎన్టీయుహెచ్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మంద రంజిత్ కుమార్ మరియు రాష్ట్ర జాక్ కమిటీ సభ్యులు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
News
నూతన ఉన్నత విద్యా మండలి చైర్మన్, వైస్ ఛైర్మన్ లకు రాష్ట్ర జేఏసీ నేతల సన్మానం