Posted on 2024-10-19 18:38:20
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు ధన్యవాదాలు తెలిపిన కాంగ్రెస్ నేతలు
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ చౌరస్తా నుంచి రాయికల్ వై జంక్షన్ వరకు 4.8 కిలోమీటర్స్ 40 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులు ఫైనల్ కోటింగ్ వేస్తున్న సందర్భంగా కాంట్రాక్టర్ తో కలిసి పనులను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చొరవతో ముమ్మరంగా కొనసాగుతున్న రోడ్డు పనులను కాంగ్రెస్ నాయకులు శనివారం సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు త్వరగా తిన పనులు పూర్తి చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఎంతో చొరవతో రోడ్డు విస్తరణ పనులను పూర్తి చేయిస్తున్నందుకు వారికి కూడా కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కే చెన్నయ్య, తిరుపతి రెడ్డి, బాలరాజ్ గౌడ్, బసవనప్ప, ఆదివాసి గిరిజన నాయకుడు శీను నాయక్, తుపాకుల శేఖర్, ఖదీర్, లింగారెడ్డి గూడా అశోక్, ఆగిరి శేఖర్, విజయ్ కుమార్ రెడ్డి, గంగ, అర్జున్ లక్ష్మణ్, దిలీప్ కుమార్,శ్రీను,రాజు, గంగ ముని సత్తయ్య, అనిల్, జగదీష్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు..
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >