గ్రామం తరపున శుభాకాంక్షలు తెలిపిన పలువురు నాయకులు.
డైలీ భారత్, మాసాయిపేట: మాసాయిపేట మండల కేంద్రం నుండి ఇద్దరు సెకండరీ గ్రేడ్ టీచర్ లుగా బుధవారం ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందుకోబోతున్న మోచి స్రవంతి భర్త సాయిలు, కామిండ్ల నాగరాజు తండ్రి చంద్రం, వీరికి మాసాయిపేట మండలం తరపున పలువురు అభినందనలు తెలిపారు. వారు మాట్లాడుతూ ఎంతో కష్టపడి ఉద్యోగం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని ఈ ఉద్యోగం కోసం చాలా కష్టపడ్డామని ఆ కష్ట ఫలితం ఎస్ జి టి లో ఉద్యోగం వచ్చిందని వారు హర్షం వ్యక్తం చేశారు. మాకు సపోర్ట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు అని తెలిపారు. అలాగే వారు మాట్లాడుతూ ఉద్యోగాలు తొందరగా భర్తీ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.