Posted on 2024-10-04 10:56:15
డైలీ భారత్, రామాయంపేట: మెదక్ జిల్లాలోని రామాయంపేటలో దారుణం చోటుచేసుకున్నది. మండలంలోని కాట్రియాలలో మంత్రాల నెపంతో ఓ మహిళను సజీవదహనం చేశారు. గురువారం రాత్రి ద్యాగాల ముత్తవ్వ అనే మహిళ తన ఇంట్లో ఉండగా గ్రామస్థులు ఆమెపై దాడి చేశారు. మంత్రాలు చేస్తున్నదని పెట్రోల్ పోసి నిప్పంటించారు. అరుపులు విన్న స్థానికులు ఆమెను రక్షించేందుకు ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. బాధితురాలిని దవాఖానకు తరలించారు.
అయితే మెరుగైన చికిత్స నిమిత్తం ఆమెను హైదరాబాద్లోని హాస్పిటల్కు తరలిస్తుండగా మృతిచెందింది. దీంతో మృతదేహాన్ని పోలీసులు రామాయంపేట దవాఖానకు తీసుకెళ్లారు. దాడి భయంతో మృతురాలి కుమారుడు, కోడలు పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
#రామాయంపేట #medak
నాయకపోడు కులస్థులకు ప్రత్యేక సీరియల్ నెంబర్ కేటాయించాలనీ డిమాండ్
Posted On 2026-04-20 18:40:20
Readmore >
గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన ఆత్మకూరు పోలీసులు
Posted On 2026-04-20 18:18:28
Readmore >
ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-20 15:16:27
Readmore >
విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు యాంటీ-ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం : డీఎస్పీ వెంకటేశ్వర్లు
Posted On 2026-04-20 13:57:43
Readmore >
బిజెపి పార్టీలో చేరిన సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ మరియు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ప్రతినిధులు
Posted On 2026-04-20 13:41:10
Readmore >