| Daily భారత్
Logo




తోగూడెం లో 1/70 కి తూట్లు : సేవాలాల్ సేన

News

Posted on 2024-09-21 07:46:30

Share: Share


తోగూడెం లో 1/70 కి తూట్లు : సేవాలాల్ సేన

క్వారీ వ్యవస్థతో కోట్ల వ్యాపారం 

తారు ప్లాంట్ల ఏర్పాటుతో మరో దోపిడీ

డైలీ భారత్, పాల్వంచ: పాల్వంచ మండల పరిధి తోగూడెం ఏజెన్సీ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న క్వారీ వ్యవస్థ ప్రజల ప్రాణాలకు ముప్పుగా వాటిల్లిందని సేవాలాల్ సేన అభ్యంతరం వ్యక్తం చేసింది. శుక్రవారం పట్టణ పరిధి కేటీపీఎస్  తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ భవన్లో సేవాలాల్ సేన ముఖ్య కార్యకర్తల సమావేశం మండల అధ్యక్షుడు పరమేష్ నాయక్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సేవాలాల్ సేన, యువసేన జిల్లా అధ్యక్షులు మా లోతు శివ నాయక్, బానోత్  భరత్ నాయక్ లు మాట్లాడుతూ.. ఏజెన్సీలో గిరిజనేతర పెత్తనం ఇటీవల కాలంలో తీవ్రతర మైందన్నారు. గిరిజనుల పేరుతో గిరిజనేతర బడా బాబులు అడ్డుకోలు దోపిడీకి పాల్పడటం రాజ్యాంగ విరుద్ధమన్నారు. తోగ్గుడెం ఏజెన్సీలో 1/70 రూల్స్ కి వ్యతిరేకంగా గిరిజనేతర వర్గాలు కోట్ల వ్యాపారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా  బాంబులు పేల్చి, కంకర ను సేకరించడం వెనుకున్న అధికార వర్గాల నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఒకడుగు ముందు కేసిన క్వారీ యాజమాన్యాలు తోగూడెం లోనే తారు ప్లాంట్లు ఏర్పాటు చేసి విచ్చలవిడి వ్యాపారానికి తెర లేపారని మండి పడ్డారు. బాంబు బ్లాస్టింగ్, తారు ప్లాంట్ల ఏర్పాటుతో పలు గృహాలు విధ్వంసానికి గురవడంతోపాటు ఆదివాసి ప్రజలు దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్నట్లు పేర్కొన్నారు. పర్మిషన్ లేని ప్లాంట్లను తక్షణం సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. పర్మిషన్ ఇచ్చిన అధికారులను తక్షణం విధులోంచి తొలగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో కలెక్టరేట్ ముట్టడి చేపడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సేవాలాల్ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు రుక్మిణి బాయ్, జిల్లా, మండల భాద్యులు పాల్గొన్నారు.

Image 1

బీజేపీ లోకి రాఘవ్ చద్దా

Posted On 2026-04-24 16:36:30

Readmore >
Image 1

మదనపల్లెలో టమాట ధర రూ.38కు చేరిక...

Posted On 2026-04-24 12:08:57

Readmore >
Image 1

పరువు హత్య.. చెల్లెలి చెలికాడిని కొట్టి చంపిన అన్నలు...

Posted On 2026-04-24 12:08:02

Readmore >
Image 1

స్తంభించిన న్యాయవ్యవస్థ...

Posted On 2026-04-24 12:06:23

Readmore >
Image 1

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం

Posted On 2026-04-24 11:24:14

Readmore >
Image 1

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ మృతి

Posted On 2026-04-23 22:57:41

Readmore >
Image 1

అదనపు ఎస్పీ బి. చైతన్య రెడ్డి, IPS ఘన వీడ్కోలు

Posted On 2026-04-23 22:41:19

Readmore >
Image 1

శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Posted On 2026-04-23 22:39:08

Readmore >
Image 1

నిర్లక్ష్యపు నీడలో నలిగిన మానుకోట

Posted On 2026-04-23 22:03:53

Readmore >
Image 1

నూతన బోరు మోటర్ బిగింపు

Posted On 2026-04-23 18:59:41

Readmore >