Posted on 2024-09-20 22:12:17
డైలీ భారత్, కర్ణాటక డెస్క్: కర్ణాటకలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మైసూరు రోడ్డులోని కంబీపూర్లోని ఏసీఎస్ కాలేజీలో ఈ దారుణం చోటుచేసుకుంది.
కాలేజీ బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరాలను కొంత మంది అమ్మాయిలు గమనించారు. దీనిపై వెంటనే కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తు, అమ్మాయిలు నిరసనలు చేపట్టారు.
ఇదిలా ఉండగా.. పోలీసులు రంగంలోకి దిగారు. అక్కడ ఉన్న హిడెన్ కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. దీనిలో కుశాల్ అనే ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థి కారణమని కూడా బైటపడింది. అతని ఫోన్ లు, ల్యాప్ టాప్ లను పరిశీలించగా.. వేల కొలది న్యూడ్ వీడియోలు ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఈ ఘటన కన్నడ నాట పెనుదుమారంగా మారింది. దీంతో కాలేజీలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
వెంటనే పోలీసులు రంగంలోకి దిగి కుశాల్ ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు వచ్చి కాలేజీ వద్ద నిరసనలకు దిగాయి. కాలేజీ యాజమాన్యం వద్దకు అమ్మాయిల తల్లిదండ్రులు చేరుకుని ఘటనపై మండిపడుతున్నారు. ప్రస్తుతం పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే.. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో గుడ్లవల్లేరు కాలేజీలో కూడా వాష్ రూమ్ లో.. యువతుల బాత్రూమ్ లో ఇలాంటి హిడెట్ కెమెరా ఘటన తీవ్ర వివాదంగా మారిన విషయం తెలిసిందే. అక్కడ కూడా.. ఒక యువతి తన లవర్ కోసం.. అమ్మాయిల బాత్రూమ్ లో.. సీక్రెట్ కెమెరాలను పెట్టినట్లు ప్రచారం జరిగింది. దీనిపైన ఏపీ సీఎం చంద్రబాబు ఘటనను సీరియస్ గా తీసుకున్నారు. అంతేకాకుండా.. విద్యార్థినులకు న్యాయం చేయాలని కూడా పలు సంఘాలు, కాలేజీకి చేరుకుని తమ నిరసలను సైతం తెలిపాయి.
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం
Posted On 2026-04-24 11:24:14
Readmore >
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Posted On 2026-04-23 22:39:08
Readmore >
సగర భగీరథ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సంకుబాపన అనుదీప్
Posted On 2026-04-23 18:39:41
Readmore >