Posted on 2024-09-21 12:30:16
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: యువత ధ్యానం, యోగావంటి సాధనాలతో కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టి తమ భవిష్యత్తును బంగారుమయం చేసు కోవాలనే లక్ష్యంతో జరుగుతున్న అంతర్జాతీయ యూత్ సెమినార్ కార్యక్రమానికి రాష్ట్రమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం లోని నందిగామ మండల పరిధిలోని కన్హాశాంతి వనంలో జరుగుతున్న కామన్వెల్త్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్స్ టు కంబార్ట్ డేజార్టీపీకేషన్ (యుఎన్ సిసిడి), తెలంగాణ ప్రభుత్వం, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ( ఏ ఐ సి టి ఈ), ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రిసెర్చ్ (ఐకార్) సహకారంతో రైజింగ్ విత్ పేరుతో అంతర్జాతీయ యూత్ సెమినార్ ను ఏర్పాటు చేశారు. ఈ సెమినార్కు రాష్ట్ర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే శంకర్ ముఖ్య అతిదులుగా హాజరయ్యారు.
రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో నిర్వాహకులు వీరికి ఘన స్వాగతం పలికారు. అనంతరం అతిధులను గౌరవంగా సత్కరించారు..
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం
Posted On 2026-04-24 11:24:14
Readmore >
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Posted On 2026-04-23 22:39:08
Readmore >