Posted on 2023-11-10 10:09:03
షాపులు షాపింగ్ మాల్ లలో పనిచేసే గుమస్తాలకు బోనస్ మరియు కనీస వేతనాలు వెంటనే అమలు చేయాలి.
సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ముషం రమేష్ మోర అజయ్ డిమాండ్
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో ఎగమంటి ఎల్లారెడ్డి గారి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మూశం రమేష్ మోర అజయ్ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇంటర్ డిగ్రీలు ఆ పైన చదివిన అనేకమంది నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగాలు లేక ఉపాధి లేక షాపులు షాపింగ్ మాల్స్ లలో పనిచేస్తుంటే అట్టి యజమానులు వారి నిరుద్యోగాన్ని ఆసరా చేసుకుని కనీస వేతనాలు ఇవ్వకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని అదేవిధంగా ఒక్క మనిషి ఈ రోజులలో ఆటో కైనా బస్సులలోనైనా ప్రయాణం చేసి సిటీకి చేరుకోవాలంటే కనీసం రానుపోను 50 నుండి 100 రూపాయల ఖర్చులు అవుతున్నాయి కానీ యజమానులు మాత్రం 6000 నుండి 9000 వరకు మాత్రమే ఇస్తూ రాత్రి పది గంటల వరకు వారితో శ్రమ చేయించుకుంటూ ఉన్నారు. నెలలో ప్రయాణ ఖర్చులు తీసివేస్తే 3000 నుండి 6000 వరకు మాత్రమే వేతనాలు వారికి అందుతున్నాయి కనీసం పనిచేసే గుమస్తాలకు టి ఏ డి ఏ లు కూడా ఇస్తున్నటువంటి దాఖలాలు లేవు. కనీసం కార్మిక శాఖ అధికారులు కూడా అటువైపుగా చూస్తున్నటువంటి దాఖలాలు లేవు షాపింగ్ మాల్స్ లలో దాదాపు 20 నుండి 30 మంది కార్మికులు పనిచేస్తున్నప్పటికీ కనీసం వారికి పిఎఫ్ సౌకర్యాలు కూడా కల్పించకుండా కార్మిక శాఖ అధికారులను పీఎఫ్ అధికారులను తప్పుదోవ పట్టిస్తూ గుమస్తాలకు పెద్ద ఎత్తున నష్టం చేకూరుస్తూ ఉన్నారు. అదేవిధంగా వారికి అవసరం ఉన్నన్ని రోజులు వాడుకుని వారిని పని నుండి తొలగిస్తున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి కావున ఇప్పుడు వచ్చిన దీపావళికి వెంటనే ఒక నెల వేతనం బోనస్ గా ఇచ్చి తదుపరి నుండి కనీస వేతనాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా గుమస్తా సోదరి సోదరులు ఒకవేళ ఇవ్వని ఎడల కార్మిక శాఖ అధికారికి ఫిర్యాదు చేయగలరు లేదా జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మోర తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >